పాకిస్తాన్ ఆర్మీకి నిద్రలేకుండా చేస్తున్న అందమైన అమ్మాయిలు.. వీళ్ల కథ ఇదే!

పాకిస్తాన్‌తో విడిపోయి ప్రత్యేక దేశంగా మారాలనుకుంటున్న బలూచిస్తాన్ తిరుగుబాటు దళం BLAలో మహిళలు కూడా ఉన్నారు. బలూచ్ తెగలో అందమైన అమ్మాయిలు ఎక్కువ. పాక్ సైన్యం వారిపై చేసే అఘాయిత్యాలు తట్టుకోలేక వారు కూడా ఉద్యమంలోకి వెళ్లి సూసైడ్ బాంబర్లుగా మారుతున్నారు.

New Update
baloch movement

ప్రస్తుతం పాకిస్తాన్‌ను జగజగ వణికిస్తున్న ప్రాంతం బలూచిస్తాన్. అది స్వరాజ్యం కోసం పోరాడుతున్న గడ్డ. పాకిస్తాన్ దేశంలో బలూచ్ తెగ అనిచివేతకు గురవుతుంది. అక్కడ జనాభా తక్కువ, సహజవనరులు ఎక్కువ. 1948 నుంచి ఈ ప్రాంతం, తెగ దోపిడికి గురవుతుంది. బలూచిస్తాన్‌ లిబరేషన్ ఆర్మీ అనే ఓ సంస్థగా ఏర్పడి ప్రత్యేక దేశం కోసం వారు పాకిస్తాన్‌తో ఫైట్ చేస్తున్నారు. అందులో కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. సాధారణంగా బలూచ్ తెగలో అందమైన స్త్రీలు ఉంటారు. వారు కూడా తుపాకులు పట్టి బీఎల్‌ఏలో చేరారు. ఇలా అందమైన యువతులు బాంబులు పెట్టడం, గన్ ఫైరింగ్ నేర్చుకొని పాకిస్తాన్ ఆర్మీతో పారాడుతున్నారు. బలూచ్ తెగ మహిళలపై పాక్ ఆర్మీ లైంగిక దాడులకు పాల్పడుతుందని కూడా ఆరోపణలు ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం అరచకాలు తట్టుకోలేక బలూచిస్తాన్ ప్రాంతంలో అమ్మాయిలు వేర్పాటువాద దళంలో  చేరారు.

పాకిస్తాన్‌‌లో చైనీయులను తరిమిన షారీ 

2022 ఏప్రిల్‌లో  జరిగిన ఆత్మహుతి దాడే అందుకు నిదర్శనం. ఇద్దరు పిల్లల తల్లి అయిన 30 ఏళ్ల షారీ బలోచ్ కరాచీ విశ్వవిద్యాలయంలోని కన్ఫ్యూషియస్ సెంటర్‌ను టార్గెట్‌గా చేసుకొని ఆత్మాహుతి బాంబు దాడిలో ముగ్గురు చైనీస్ బోధకులు సహా నలుగురిని చంపేసింది. దీంతో పాకిస్తాన్ ఒక్కసారిగా షాక్ అయ్యింది. దీంతో పాకిస్తాన్‌లో ఉన్న చైనీస్ ఆ దేశం విడిచి పెట్టి పోయారు. ఇలాంటి దాడులు చేస్తూ బలూచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపోయి ప్రత్యేక దేశంగా ఉండాలని కోరుకుంటుంది.

సుమైయా బలూచ్ ఆత్మబలిదానం

ఒక సంవత్సరం తర్వాత, జూన్ 2023లో రెండవ దాడి జరిగింది. బలూచిస్తాన్‌లోని టర్బత్ జిల్లాలో పాకిస్తాన్ సైనిక కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని మరో మహిళా ఆత్మాహుతి బాంబర్ సుమైయా ఖలాండ్రాని బలూచ్ దాడి చేసింది. దీంతో బలూచిస్తాన్ తిరుగుబాటు కోసం ఏర్పడిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సాయుధ పోరాటంలో మహిళలు యాక్టీవ్‌గా పాల్గొనడం ప్రారంభమైంది. 25 ఏళ్ల సుమైయా కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చదువుతూ BLA మీడియా విభాగమైన హక్కల్‌లో పనిచేస్తోంది.

2018 నుంచి సూసైడ్ బాంబర్లు

బలూచిస్తాన్ సెపరేటిజంలో అత్యంత ప్రజాదరణ పొందిన వారిలో కరీమా మెహ్రబ్ బలూచ్ ఒకరు. ఆమె బహిష్కరించబడిన బలూచ్ కార్యకర్త, ఆమె 2020లో కెనడాలో అనుమానాస్పదంగా చనిపోయింది. బలూచ్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఆజాద్ (BSOA)కు 2014లో మొదటి మహిళా చైర్‌పర్సన్ అయ్యారు. బలూచిస్తాన్ తిరుగుబాటులో 2018 వరకు ఆత్మాహుతి బాంబు దాడుల జరగలేదు. తర్వాత BLA తన ఆత్మాహుతి దళమైన మజీద్ బ్రిగేడ్‌ను స్థాపించింది. కరాచీలోని చైనీస్ కాన్సులేట్, గ్వాదర్‌లోని పెర్ల్ కాంటినెంటల్ హోటల్, పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బలూచిస్తాన్‌లోని నుష్కి జిల్లాలోని పారామిలిటరీ దళం అయిన ఫ్రాంటియర్ కార్ప్స్ ప్రధాన కార్యాలయం వంటి వాటిని టార్గెట్ చేసుకొని దాడులు చేయడం ప్రారంభించారు.

మొదటి ఆత్మహుతి దాడి ఇతనే

సుమయ్య కాబోయే భర్త, బ్రిగేడ్‌ను స్థాపించిన అస్లాం బలూచ్ కుమారుడు రెహాన్ బలూచ్ 2018లో దల్బాదిన్ జిల్లాలో CPECలో పనిచేస్తున్న చైనీస్ ఇంజనీర్ల బస్సుపై ఉద్యమంలో మొదటి సూసైడ్ బాంబర్ అయ్యాడు. అప్పటి నుంచి బలూచ్ వేర్పాటువాదులు దాదాపు 10 ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారు. 

(attack in balochistan | baloch | balochistan | armed attack in balochistan | Balochistan Attack On Pakistan | balochistan liberation army | balochistan liberation front | balochistan liberation army news | balochistan liberation army leader | latest-telugu-news)

 

Advertisment
Advertisment
తాజా కథనాలు