పాకిస్థాన్‌లో ట్రైన్‌ను హైజాక్ చేసిన ఉగ్రవాదులు.. నిర్బంధంలో వందలాది ప్రయాణికులు

పాకిస్థాన్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. మంగళవారం బలుచిస్తాన్‌లోని జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను హైజాక్‌ చేశారు. వందలాది మంది ప్రయాణికులను నిర్బంధించారు. ఇది తామే చేశామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది.

New Update
Baloch Liberation Army Hijack Jaffar Express Train In Pakistan

Baloch Liberation Army Hijack Jaffar Express Train In Pakistan

పాకిస్థాన్‌లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. ఏకంగా ఓ రైలునే హైజాక్ చేశారు. మంగళవారం బలుచిస్తాన్‌లోని జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ ట్రైన్‌ను తీవ్రవాదులు హైజాక్‌ చేశారు. ఇది తామే చేశామని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది. దాదాపు 400 మందికి పైగా ప్రయాణికులను తీవ్రవాదులు ట్రైన్‌లో నిర్బంధించడం కలకలం రేపుతోంది. పాకిస్థాన్‌లోని బలొచిస్థాన్ ప్రావిన్స్‌ నుంచి 
ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పెషావర్ వరకు వెళ్తున్న జాఫర్‌ రైలులో మంగళవారం ఈ హైజాక్ ఘటన జరిగింది.  

Also Read: చైనా సైంటిస్టుల అద్భుతం.. గుండెపోటు, స్ట్రోక్స్ రాకుండా వ్యాక్సిన్!

ట్రైన్‌ మొత్తాన్ని తమ ఆధినంలోకి తీసుకున్నామని.. ఆరుగురు మిలిటరీ సిబ్బంది మృతి చెందారని బీఎల్‌ఏ తీవ్రవాద సంస్థ తెలిపింది. వందలాది మంది ప్రయాణికులను నిర్బంధించినట్లు పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. '' మష్కఫ్‌, దాబర్, బోలాన్‌ ప్రాంతాల్లో బలోచ్ లిబరేషన్ ఆర్మీ ప్రణాళికబద్ధంగా ఆపరేషన్‌ను చేపట్టింది. మా పోరాట యోధులు రైల్వేట్రాక్‌ను ధ్వంసం చేసి జాఫర్‌ ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. ఆ తర్వాత వెంటనే ట్రైన్‌ను తమ ఆధినంలోకి తీసుకొని, ప్రయాణికులను నిర్బంధించారు. 

Also Read: ఆయుధాల దిగుమతిలో భారత్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో ఉక్రెయిన్ !

ఆక్రమణ దళాలు ఇక్కడ ఏదైనా మిలటరీ ఆపరేషన్లు చేపడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. వందలాది మంది ప్రయాణికులను హతమారుస్తాం. ఈ ఊచకోతకు ఆక్రమణ దళాలే బాధ్యత వహించాల్సి ఉంటుంది. బీఎల్‌కు చెందిన మజీద్ బ్రిగేడ్, STOS, ఫతే స్వాడ్ - స్పెషలైజ్‌డ్ యూనిట్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టాయి. ఇప్పటిదాకా ఆరుగురు మిలిటరీ సిబ్బంది మృతి చెందారు. వందలాది మంది ప్రయాణికులు బీఎల్‌ఏ కంట్రోల్‌లోనే ఉన్నారు. ఈ ఆపరేషన్‌కు బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పూర్తిగా బాధ్యత వహిస్తుందని'' బీఎల్‌ఏ ఓ ప్రకటనలో తెలిపింది. 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు