/rtv/media/media_files/2025/06/20/axiom-4-mission-2025-06-20-08-11-38.jpg)
ఇండియన్ ఆస్ట్రోనాట్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్ర యాత్ర మరోసారి ఆలస్యం కానునుంది. ఆక్సియం-4 మిషన్ ప్రయోగాన్ని ఆరోసారి వాయిదా వేస్తున్నట్లు NASA ప్రకటించింది. ఇందులో భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా తన నలుగురు సభ్యులతో కలిసి ISS వెళ్లనున్నారు. జూన్ 22 ఆదివారం జరగాల్సిన ఈ ప్రయోగం ఇప్పుడు వాయిదా పడింది. త్వరలో కొత్త తేదీని ప్రకటించనున్నారు.
NASA, Axiom Space, and SpaceX continue reviewing launch opportunities for Axiom Mission 4. NASA is standing down from a launch on Sunday, June 22, and will target a new launch date in the coming days. pic.twitter.com/rJpuKDhEhH
— ANI (@ANI) June 19, 2025
ఇప్పటికే ఈ ప్రయోగం ఐదుసార్లు షెడ్యూల్ చేసి వాయిదా వేశారు. మొదట మే 29న జరగాల్సి ఉండగా, ప్రయోగం జూన్ 8, జూన్ 10, జూన్ 11, జూన్ 19, జూన్ 22 తేదీలకు వాయిదా పడింది. ఫాల్కన్ 9 రాకెట్ సిద్ధం చేయడంలో జాప్యం, అననుకూల వాతావరణ పరిస్థితులు, సాంకేతిక లోపాల కారణంగా ఆక్సియం-4 మిషన్ ఆలస్యం కావడం ఇది ఆరోసారి.