/rtv/media/media_files/2025/08/11/aug-27-2025-08-11-09-54-03.jpg)
Trump Tariffs Impose On Aug 27th On India
రష్యాతో చమురు వ్యాపారం చేయకూడదని.. దాని ద్వారా ఆ దేశం ఉక్రెయిన్ తో యుద్ధం మానేసేలా చేయాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పై వత్తిడి తీసుకువచ్చారు. 24 గంటలు టైమ్ ఇచ్చి...తన మాట వినకపోతే అప్పటికే విధించిన 25 శాతం సుంకాలతో పాటూ అదనంగా మరో 25 శాతం విధిస్తామని బెదిరించారు. అయితే భారత్.. ట్రంప్ మాట వినలేదు. ఎవరితో వాణిజ్యం చేయాలనేది తమకు బాగా తెలుసునని ధీటుగా సమాధానం చెప్పింది. దీంతో ట్రంప్...ఇండియాపై 50 శాతం సుంకాలతో విరుచుకుపడ్డారు. ఇవి ఆగస్టు 27 నుంచి అమలు అవుతాయని చెప్పారు.
బ్రిక్స్ దేశాలు..అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం..
అప్పుడే అదే రోజు మొదైలంది ప్రపంచ వాణిజ్య యుద్ధం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒక వైపు, బ్రిక్స్ దేశాలు మరోవైపు అయిపోయాయి. బ్రిక్స్ దేశాల ఆటలు సాగవని...డాలర్ తో పాటూ అమెరికా పతనం కానివ్వనని ట్రంప్ అంటున్నారు. మరోవైపు అమెరికా ఆధిపత్యం ఇక చెల్లదని బ్రిక్స్ దేశాలు చెబుతున్నాయి. అదనపు సుంకాలతో అమెరికా అధ్యక్షుడు అన్యాయంగా, అసమంజసంగా ప్రవర్తిస్తున్నారని భారత్ ఆరోపించింది. దీనికి రష్యా వత్తాసు పలికింది. దాంతో పాటూ ఇండియాకు శత్రువు అయిన చైనా కూడా ఈసారి మద్దతు పలికింది. ఈ నేపథ్యంలో భారత ప్రధాని తొమ్మిదేళ్ళ తర్వాత చైనా కూడా వెళ్ళనున్నారు. అప్పుడు సుంకాల మీద చర్చలు జరగవచ్చని చెబుతున్నారు. రష్యా, చైనా, భారత్ కలిస్తే అమెరికాకు కష్టం అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
సొంత దేశంలోనే వ్యతిరేకత..
మరోవైపు ట్రంప్ సుంకాల నిర్ణయం పట్ల సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. అక్కడి అమెరికా అధ్యక్షుడి సొంత పార్టీలో నేతలతో పాటూ ఆర్థికవేత్తలు, మాజీ అధికారులు కూడా తిట్టిపోస్తున్నారు. భారత్ తో తగవు పెట్టుకుని ట్రంప్ చాలా పెద్ద తప్పు చేస్తున్నారని చెబుతున్నారు. తన గోతిని తానే తవ్వుకుంటున్నారని...అమెరికా పతనానికి దారి తీస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు సుంకాల వలన అమెరికాలోనే ధరలు ఎక్కువ అవుతాయని..మరింత ఆర్థికంగా పతనం అవుతుందని చెబుతున్నారు. దీని ప్రభావం అప్పుడే కనిపిస్తోంది కూడా. సుంకాల భారం తగ్గించుకోవడానికి అమెరికాలోని బడా కంపెనీలు భారత్ నుంచి సరుకు వద్దని చెబుతున్నారు. దీంతో అక్కడి వాల్ మార్ట్, టార్గెట్ ల్లాంటి వాటిల్లో ధరలు పెరుగుదల కనిపిస్తోంది.
రష్యా కాల్పుల విరమణపైనే అంతా..
ఇక భరాత్ పై అదనపు సుంకాలు ఆగస్టు 27 నుంచి అమలు కానున్నాయి. అయితే ఇవి అమలు కావని...ట్రంప్ వీటని వెనక్కు తీసుకుంటారని ప్రపంచ ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. పాక్ ఆర్థిక వేత్త ఒకరు కూడా ఇదే మాట చెప్పారు. ఈ లోపునే అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ కానున్నారు. ఆగస్టు 15న వీరిద్దరూ అలస్కాలో కలవనున్నారు. ఈ భేటీలో రష్యా, ఉక్రెయిన్ మధ్య కాల్పుల విరమణ, శాంతి ఒప్పందంపై చర్చించనున్నారు. ఇందులో కనుక ట్రంప్ సక్సెస్ అయి రష్యా కాల్పుల విరమణకు అంగీకరిస్తే...అదనపు సుంకాల నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు వెనక్కు తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. భారత్ కూడా దీనిపై ఆశాభావం వ్యక్తం చేస్తోంది. అంతకు ముందు భారత్ తో వాణిజ్య చర్చలకు ఎటువంటి ఆస్కారం లేదని ట్రంపం తేల్చి చేప్పేయడంతో ఇప్పుడు ఇదొక్కటే మార్గమైంది. దీంతో వచ్చే ఆగస్టు 27 భారత కే కాదు ప్రపంచ దేశాలకు చాలా ముఖ్యమైన తేదీగా మారింది. ఆ రోజు చర్చల తర్వాత అమెరికా అధ్యక్షుడు తీసుకునే నిర్ణయం..భారత్ తో పాటూ ప్రపంచ స్థితిగతులు మార్చే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read: Coolie Movie: కూలీలో మరో సర్ ప్రైజ్..యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో!