/rtv/media/media_files/2025/05/15/B5Qk3m3JDa8FScPlqfzQ.jpg)
Apple CEO Tim Cook, Trump
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, యాపిల్ బాస్ టిమ్ కుక్ లకు మధ్య వార్ నడుస్తోంది. ఇండియాలో యాపిల్ ప్లాంట్ పెట్టొద్దని దోహాలో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ కు ట్రంప్ కండిషన్ పెట్టారు. కానీ దానిని వారు ఖాతరు చేయలేదని తెలుస్తోంది. ఇండియాలో యాపిల్ ప్లాంట్ పెట్టడానికే టిమ్ కుక్ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి ఆయన హామీ ఇచ్చినట్టు కూడా చెబుతున్నారు. ఇండియాలో పెట్టుబడులు పెడతామని, అందులో ఎలాంటి మార్పులు ఉండవని భారత ప్రభుత్వానికి యాపిల్ కంపెనీ చెప్పినట్లు తెలుస్తోంది.
భారత్ లో పెట్టుబడులతో లాభాలు..
అయితే భారత్ లో యాపిల్ భవనాలు నిర్మించడం ఇష్టం లేదని ట్రంప్..టిమ్ కుక్ కు చెప్పారు. భారత్లో ఐఫోన్లను తయారు చేయవద్దని యాపిల్ సంస్థ సీఈవో టిమ్కుక్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. యాపిల్ ఐఫోన్లను భారత్లో తయారు చేయడం తనకు ఇష్టం లేదనీ, అత్యంత టారిఫ్లు విధించే దేశాల్లో భారత్ ఒకటని టిమ్కుక్కు చెప్పినట్లు ట్రంప్ తెలిపారు. కానీ భారతదేశంలో ప్లాంట్ పెడితేనే మంచిదని టిమ్ కుక్ భావిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ ఉత్పత్తి రంగంలో భారతదేశం ఒక ముఖ్యపాత్రధారిగా మారిందని..కంపెనీలు భారతదేశంలో తయారీ విలువను గుర్తిస్తే, వారు ఆ మార్గంలోనే కొనసాగుతారని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ త్రైమాసికం నుండి అమెరికాలో అమ్ముడైన ఐఫోన్లలో ఎక్కువ భాగం 'భారతదేశంలోనే తయారవుతాయని తెలిపారు. అందుకే ట్రంప్ చెప్పినా కూడా భారతదేశంలో పెట్టుబడి ప్రణాళికలను మార్చే ఆలోచన లేదని యాపిల్ కంపెనీ చెబుతోందని తెలుస్తోంది. ప్రస్తుతం భారత్లో యాపిల్కు తమిళనాడులో రెండు, కర్ణాటకలో ఒక తయారీ కేంద్రాలున్నాయి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ఐఫోన్ల అసెంబ్లింగ్ 60శాతం పెరిగింది. మరో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆ సంస్థ యోచిస్తోంది.
today-latest-news-in-telugu | apple-iphones | 47th us president donald trump
Also Read: దేశ ప్రధానిని పొగిడితే తప్పేంటి.. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మరో ప్రకటన