/rtv/media/media_files/2025/11/19/trump-reporter-2025-11-19-09-59-13.jpg)
ప్రస్తుతం సౌదీ అరేబియా ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అమెరికాలో పర్యటిస్తున్నారు. ఏడేళ్ళ తర్వాత ఆయన అమెరికాకు వచ్చారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు వైట్ హౌస్ లోని ఓవల్ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఏబీసీ ఛానెల్ కు సంబంధించిన ఓ రిపోర్టర్..సౌదీ అరేబియా ప్రిన్స్ ఎంబీఎస్ ను జర్నలిస్ట్ ఖషోగ్గి హత్యపై ప్రశ్నించింది. అంతే వెంటనే ట్రంప్ ఆమెపై గట్టిగా అరిచారు. ప్రిన్స్ ను సమర్ధిస్తూ..మీరు మాట్లాడుతున్న ఆ పెద్దమనిషి చాలామందికి నచ్చలేదు. మీకు నచ్చినా.. నచ్చకపోయినా అది జరిగిపోయింది.సౌదీ ప్రిన్స్కు దానిగురించి ఏమీ తెలియదు. మనం దాన్ని అలాగే వదిలేయాలి. ఇలాంటి ప్రశ్నలు అడిగి మీరు అతిథిని ఇబ్బందిపెట్టాల్సిన అవసరం లేదు అంటూ ఏబీసీ జర్నలిస్ట్ పై మండిపడ్డారు. అంతేకాదు ఆ ఛానెల్ లైసెన్స్ రద్దు చేయాలన్నారు. ఆ ఛానెల్ వి అన్నీ నకిలీ వార్తలు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ప్రశ్నకు ఎంబీఎస్ స్పందిస్తూ ఖషోగ్గి హత్య చాలా బాధాకరమైనదన్నారు.
Trump is FED UP with ABC Reporter: "You know, it's not the question that I mind. It's your attitude. The way you ask a question with the anger and the meanness is terrible. You ought to go back and learn how to be a reporter. No more questions from you."🔥 pic.twitter.com/a1JrcUJN4X
— TheBlaze (@theblaze) November 18, 2025
అప్పుడు తగవు..ఇప్పుడు సంధి..
జర్నలిస్ట్ ఖషోగ్గి హత్య 2018లొ జరిగింది. అప్పుడు ట్రంప్ మొదటి టర్మ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అప్పట్లో ఖషోగ్గి హత్య సౌదీ- అమెరికాల మధ్య దౌత్య సంక్షోభానికి దారితీసింది. అంతేకాదు ఈ హత్య వెనుక సౌదీ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హస్తం ఉందని ారోపణలు వచ్చాయి. దీన్ని అమెరికా ఇంటలిజెన్స్ విభాగం కూడా ధృవీకరించింది. అయితే ప్రస్తుతం ట్రంప్ అమెరికా-సౌదీ అరేబియా సంబంధాలను పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖషోగ్గి హత్య టైమ్ లో ఏర్పడిన దౌత్య సంక్షోభాన్ని దూరం చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఈ క్రమంలో ఆ దేశానికి ఎఫ్-35 ఫైటర్ జెట్లను విక్రయించనున్నట్లు తెలిపారు. అలాగే యూఎస్లో 1 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలనే కీలక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నారు. దాంతో ాటూ సౌదీ ప్రిన్స్ వచ్చిన సందర్భంలో పెద్ద విందును కూడా ఏర్పాటు చేశారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ేర్పాటు చేసిన ఈ విందుకు టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ తో పాటూ ఫుట్ బాల్ స్టార్ ఆటగాడు కరిస్టియానో రొనాల్డో, ట్రంప్ కుమారుడు బారన్ ట్రంప్ కూడా పాల్గొన్నారు.
Also Read: PM Modi: అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రధాని మోదీ వాచ్ ..దీని ఖరీదు ఎంతో తెలుసా?
Follow Us