Big Breaking : ప్రధాని మోదీని చంపేందుకు అమెరికా కుట్ర..CIA ఏజెంట్ తో స్కెచ్

భారత ప్రధాని నరేంద్రమోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా?  సీఐఏతో కలిసి మోదీ హత్యకు స్కెచ్‌ వేసిందా?  ఆ కుట్రను భారత్, రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా? ఇప్పుడీ అనుమానాలు సంచలనంగా మారాయి.

New Update
American conspiracy to kill Prime Minister Modi..

American conspiracy to kill Prime Minister Modi..

PM Modi: భారత ప్రధాని నరేంద్రమోదీని హత్య చేసేందుకు అమెరికా కుట్ర చేసిందా?  సీఐఏతో కలిసి మోదీ హత్యకు స్కెచ్‌ వేసిందా?  ఆ కుట్రను భారత్, రష్యా సంయుక్తంగా భగ్నం చేశాయా? ఇప్పుడీ అనుమానాలు సంచలనంగా మారాయి. ఈ సందేహాలు తలెత్తడానికి కారణం లేకపోలేదు. బంగ్లాదేశ్ లో యూఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ అనుమానాస్పద రీతిలో మరణించాడు. ఆయన మరణంతో  అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. CIA ఏజెంట్, యూఎస్‌ స్పెషల్ ఆఫీసర్‌ టెర్రెస్‌ జాక్సన్‌తో కలిసి మోదీని హతమార్చాలని అమెరికా ప్లాన్‌ చేసిందనే వార్తలు వినవస్తున్నాయి.

CIA ఏజెంట్, US స్పెషల్ ఫోర్సెస్ ఆఫీసర్ టెర్రెన్స్ జాక్సన్ బంగ్లాదేశ్‌లో చనిపోయాడు. అతడి మరణం మిస్టరీగా మారింది. దీంతో పలు అనుమానాలకు దారితీసింది. ప్రధాని మోదీని చంపేందుకు CIA కుట్ర చేసిందని, దాన్ని భగ్నం చేసేందుకే ఇండియా, రష్యా టెర్రెన్స్‌ను హతమార్చాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అతడు చనిపోయిన రోజు చైనాలో మోదీ, పుతిన్‌ కారులో రహస్యంగా చర్చలు జరిపారని అంతర్జాతీయ మీడియా పేర్కొనడం గమనార్హం.

ఆగస్ట్ 31న బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలోని ఒక హోటల్ గదిలో అమెరికా ప్రత్యేక దళాల అధికారి టెర్రెన్స్ అర్వెల్లె జాక్సన్ అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. ఇది దక్షిణాసియాలో ముఖ్యంగా భారత్ లో అమెరికా నిఘా చర్యలపై సందేహాలను రేకెత్తించింది. అమెరికా భద్రతా అధికారి మరణం అనేక అనుమానాలను లేవనెత్తింది. ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకునే ఎజెండాతో ఆ అధికారిని ఢాకాలో మోహరించారని ప్రచారం సాగుతోంది. ప్రధాని మోదీని హత్య చేయాలనే ప్రయత్నం జరిగి ఉండొచ్చన్నది విశ్లేషకులు అనుమానిస్తున్నారు. అయితే భారత్, రష్యా నిఘా విభాగాల ఉమ్మడి ఆపరేషన్ ద్వారా ఈ కుట్రను భగ్నం చేశారని చెబుతున్నారు.

టెరెన్స్ అర్వెల్లె జాక్సన్ ఆగస్టు 31న ఢాకాలోని తన హోటల్ గదిలో అనుమానస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. సెయింట్ మార్టిన్స్ ద్వీపంలో బంగ్లాదేశ్ సైన్యానికి శిక్షణ ఇవ్వడానికి అతడిని బంగ్లాదేశ్‌లో నియమించినట్లు నివేదికలు చెబుతున్నాయి. జాక్సన్ మృతి చెందిన రోజు ప్రధాని మోదీ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు చైనాలోని టియాంజిన్‌ వెళ్లారు. శిఖరాగ్ర సమావేశం తర్వాత మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  కొంత సమయం వరకు కారులో కూర్చుని తీవ్రమైన చర్చలు జరిపారని తెలుస్తోంది.

ఈ సందర్భంగా ప్రధాని మోదీని హత్య ప్రయత్నం పై చర్చకు వచ్చినట్లు, రష్యా అధ్యక్షుడు పుతిన్ నాయకత్వంలో భారత్, రష్యా నిఘా దళాలు సంయుక్త ఆపరేషన్‌లో ప్రధాని మోదీని హత్య చేయడానికి కుట్ర పన్నుతున్న అమెరికా భద్రతా అధికారిని ఢాకాలో మట్టుబెట్టాయని చెబుతున్నారు. టియాంజిన్‌లో కారులో మోదీ, పుతిన్‌ 45 నిమిషాల పాటు చర్చలు సాగించారు. ఈ హైప్రొఫైల్ సమావేశంలో కుట్రను గురించి చర్చించి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే మోడీ, పుతిన్ రహస్య చర్చలు జరిపిన రోజే ఢాకాలో అమెరికా అధికారి చనిపోవడం గమనార్హం.

సెప్టెంబర్ 2న చైనాలోని టియాంజిన్ నుండి తిరిగి వచ్చిన మరుసటి రోజు ప్రధాని మోదీ ఢిల్లీలో జరిగిన సెమికాన్ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. “నేను చైనాకు వెళ్ళినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా లేదా నేను తిరిగి వచ్చినందుకు మీరు చప్పట్లు కొడుతున్నారా?” అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ప్రధాని మోదీ చేసిన ఈ నిగూఢ వ్యాఖ్యల వెనుక ఏదో అర్థం ఉందని తెలుస్తోంది. ఇది ప్రధాని ప్రాణాలకు ముప్పు గురించి హెచ్చరికల నేపథ్యంలో మాట్లాడినట్లు తెలుస్తోంది. జాక్సన్‌ మృతిపై అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే మరోవైపు జాక్సన్‌ మృతిపై బంగ్లాదేశ్‌ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.టెర్రెస్ జాక్సన్‌ మృతిపై అనుమానాలు లేవని క్లారిటీ ఇచ్చింది.

Advertisment
తాజా కథనాలు