BIG BREAKING : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. మరణించిన విద్యార్థులను మానవ్ పటేల్ (20), సౌరవ్ ప్రభాకర్ (23) గా గుర్తించారు. వారు క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకోడానికి వచ్చారని భారత కాన్సులేట్ వెల్లడించింది.

New Update
us-accident

us-accident

న్యూయార్క్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు.  ఈ సంఘటనపై న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ సంతాపం వ్యక్తం చేసింది.  మరణించిన విద్యార్థులను మానవ్ పటేల్ (20), సౌరవ్ ప్రభాకర్ (23) గా గుర్తించారు.  మే 10న పెన్సిల్వేనియాలో ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు విద్యార్థులు వెళ్తున్న కారు వంతెనను ఢీకొట్టడంతో ఇద్దరూ మరణించారు. ఈ ప్రమాదంలో వాహనం ముందు సీటులో ఉన్న మరో ప్రయాణీకుడు గాయపడగా, అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాకర్ వాహనాన్ని నడుపుతున్నాడని పోలీసులు వెల్లడించారు. ఇద్దరు విద్యార్థులు సంఘటనా స్థలంలోనే మరణించారని తెలిపారు.  

Also read :  BIG BREAKING: ఏపీలో లిక్కర్ స్కామ్ లో మరో కీలక వ్యక్తి అరెస్ట్!

Also read : BIG BREAKING: 11 మంది పాక్ సైనికులు హతం.. 78 మందికి గాయాలు!

ఉదయం 7 గంటల ప్రాంతంలో

న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్ ఈ ప్రమాదం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, విద్యార్థులు క్లీవ్‌ల్యాండ్ స్టేట్ యూనివర్శిటీలో చదువుకోడానికి వచ్చారని వెల్లడించింది.  మృతుల కుటుంబాలతో కాన్సులేట్ సంప్రదింపులు జరుపుతున్నామని..  వారికి అన్ని విధాలుగా సహాయం చేస్తామని హామీ ఇచ్చిందని తెలిపారు.

Also read :  Pawan Kalyan - OG Update: ‘ఓజి’ సెట్‌లో పవన్ కళ్యాణ్!.. ఈసారి ముగిద్దాం అంటూ పోస్ట్

Also read : Today Gold Rates: వెంటనే కొనేయండి.. భారీగా తగ్గిన బంగారం ధరలు - ప్రాంతాల వైజ్ లిస్ట్

Advertisment
తాజా కథనాలు