T20 World Cup: సూపర్ 8లో చెలరేగిన భారత్..ఆఫ్ఘాన్ మీద విజయం

టీ 20 వరల్డ్‌కప‌లో టీమ్ ఇండియా తన జైత్రయాత్ర కొనసాగిసతోంది. సూపర్‌ 8లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆఫ్ఘాన్ జట్టును 134 పరుగులకు ఆలౌట్ చేసింది.

New Update
T20 World Cup: సూపర్ 8లో చెలరేగిన భారత్..ఆఫ్ఘాన్ మీద విజయం

India VS Afghanistan: టీ20 ప్రపంచకప్‌లో టీమ్ ఇండియా మరో విజయాన్ని నమోదు చేసుకుంది. సూపర్ 8లో భాగంగా ఈరోజు ఆఫ్ఘనిస్తాన్‌తో భారత్ మ్యాచ్ ఆడింది. దీనిలో టీమ్ ఇండియా సూపర్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు మొదట్లోనే ఆవుట్ అయిపోయినా..తరువాత వచ్చిన బ్యాటర్లు బాగా ఆడడంతో మంచి స్కోరు సాధించారు. సూర్యకుమార్ యాదవ్ 53, హార్దిక్ పాండ్యా 32 రన్స్ చేశారు. అఫ్గాన్‌ బౌలర్లలో ఫరూఖీ 3, రషీద్‌ ఖాన్‌ 3, నవీనుల్‌ హక్‌ ఒక వికెట్‌ తీశారు.

తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘాన్ మీద టీమ్ ఇండియా మొదటి నుంచే ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బుమ్రా అయితే వికెట్లతో చెలరేగిపోయాడు. ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు. దీంతో 27 పరుగులకే ౩ వికెట్లు కోల్పోయి కషటాల్లో పడింది ఆఫ్ఘాన్. అక్కడి నుంచి ఆ టీమ్‌కు కోలుకోవడం కష్టం అయింది. ఆ తరువాత కూడా వరుసగా వికెట్లు పడుతూనే ఉన్నాయి. మధ్యలో కాసేపు బాగానే ఆడారు. ఆ జట్టులో ఒమర్జాయ్ 26 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో బుమ్రా 3, అర్ష్‌దీప్‌ 3, కుల్‌దీప్‌ యాదవ్‌ 2, జడేజా, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్ తీశారు.

Also Read:Vande Bharat: వందే భారత్ ఆహారంలో బొద్దింక.. సారీ చెప్పిన రైల్వేశాఖ

Advertisment
తాజా కథనాలు