IND VS PAK:భారత్-పాక్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్

భారత్-పాక్ మ్యాచ్ మొత్తం ఇండియా అంతా తెగ ఎదురు చూస్తోంది. మ్యచ్‌ను ఫుల్ టూ ఎంజాయ్ చేయాలని అనుకుంటోంది. ఇందుకు హైదరాబాద్ సైతం సిద్ధమవుతోంది. భారీ స్క్రీన్‌లతో హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు.

New Update
IND VS PAK:భారత్-పాక్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్

భారత్, పాకిస్తాన్ల మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఎప్పుడూ హడావుడి ఉంటుంది. అందులోనూ వరల్డ్ కప్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. రెండు క్రికెట్ టీమ్‌ల మధ్య కాకుండా రెండు దేశాల మధ్య సమరంగా భావిస్తారు. అందులోనూ ఈసారి వరల్డ్ కప్ భారత్ లో జరగడంతో ఈ మ్యాచ్‌కు మరింత క్రేజ్ ఏర్పడింది.

ఈరోజు మధ్యాహ్నం మొదలవ్వబోయే భారత్-పాక్ మ్యాచ్ ను చూసేందుకు అందరూ రెడీ అవుతున్నారు. హైదరాబాద్ సిటీ క్రేజీ మ్యాచ్ కు రెడీ అవుతోంది. భారీ స్క్రీన్‌లతో హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్లలలో ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా వీకెండ్ కావడం బాగా కలిసి వచ్చింది. దీంతో మ్యాచ్ ను చూసేందుకు నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్ తో పాటూ డీజేలతో సందడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. హైటక్స్‌లో మ్యాచ్‌ కోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్ శ్రియ కూడా పాల్గొంటున్నారు. అంధ క్రికెటర్లకు క్రికెట్ కిట్లు పంపిణీ చేయనున్నారు.

ఇక మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూసేందుకు చాలామంది అహ్మదాబాద్ తరలివెళ్ళారు. టికెట్లు రేట్లు ఎక్కువ ఉన్నా సరే కొనుక్కుని మరీ చూస్తున్నారు. అహ్మదాబాద్ కు గవర్నమెంట్ కూడా ప్రత్యేక రైళ్ళను వేసింది. మరోవైపు అహ్మదాబాద్‌లో హోటళ్ళు దొరక్క చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రుల్లో బెడ్స్ సైతం బుక్ చేసేసుకుంటున్నారు.

Also Read:మొదలైన ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్..ఇక ఏరిపారేయడమే

ఈసారి కూడా విజయం మనదేనా? 8-0తో రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడా? 

Advertisment
తాజా కథనాలు