తెలంగాణలో గెలుపే లక్ష్యంగా బీజేపీ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటోంది. ఈనెల 27న రాష్ట్రంలో అమిత్షా పర్యటన ఫిక్స్ అవ్వడంతో ఒక్కసారిగా బీజేపీ నేతల్లో జోష్ వచ్చినట్టైంది. ఖమ్మం సభ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడుసార్లు అమిత్షా పర్యటన వాయిదా పడగా.. ఈ సారి మాత్రం ఖమ్మం రాక గ్యారెంటీ అనే! చెపప్పవచ్చు. మరోవైపు దేశంలో ఈ ఏడాది తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, మిజోరం రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ప్రజా ప్రతినిధులు ఇప్పటి నుంచే ప్రజల మధ్య తిరుగుతూ ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నారు. తాజాగా దీనిపై బీజేపీ కేంద్ర ఎన్నికల సంఘం భేటీ అయింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా హాజరు కాగా తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎన్నికలపై బీజేపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. తెలంగాణలో గెలుపే లక్ష్యంగా ఇప్పటికే 2 సార్లు సర్వే చేయించిన బీజేపీ అధిష్టానం.. మరో విడత సర్వేకు సిద్దమైంది. ఈ సర్వే కోసం 40 మందితో కూడిన జాబితాను సిద్ధం చేసింది. మరోవైపు ఇదే సమావేశంలో అభ్యర్థుల లిస్ట్ను సైతం ఫైనల్ చేసే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..తెలంగాణలో పెరిగిన పొలిటికల్ హీట్.. 27న అమిత్ షా రాక
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 27 ఖమ్మం రానున్న ఆయన.. అక్కడ జరిగే భారీ బహరింగ సభలో పాల్గొననున్నారు. ఆ సభనుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణలో మరో విడత సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Translate this News: