తెలంగాణలో పెరిగిన పొలిటికల్ హీట్.. 27న అమిత్ షా రాక
కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈ నెల 27 ఖమ్మం రానున్న ఆయన.. అక్కడ జరిగే భారీ బహరింగ సభలో పాల్గొననున్నారు. ఆ సభనుంచే ఎన్నికల శంఖారావం పూరించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సమావేశమైన కేంద్ర ఎన్నికల కమిటీ తెలంగాణలో మరో విడత సర్వే చేయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.