Car Accident Case : తాగి కారు నడిపి ప్రజాభవన్(Praja Bhavan) గేట్లను కారుతో గుద్దిన మాజీ మంత్రి షకీల్(Shakeel) కొడుకు సోహెల్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. యాక్సిడెంట్ తర్వాత ఇన్నాళ్ళకు బయటకు వచ్చిన సోహెల్ ఇప్పుడు తన మీద తప్పుడు కేసు పెట్టారంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. యాక్సిడెంట్ తో తనకేం సంబంధం లేదంటూ మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్(Sohel) తెలంగాణ(Telangana) హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్(FIR) కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు. పోలీసులు కావాలనే తన పేరును నిందితుడిగా పెట్టారని సోహెల్ అంటున్నాడు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆసిఫ్ను మొదట నిందితుడిగా చేర్చారు కానీ పోలీసుల విచారణలో అతను తప్పుడు సమాచారం ఇచ్చాడని సాహిల్ అంటున్నాడు. పోలీసులు కావాలనే తన పేరు చెప్పేలా ఆసిఫ్పై ఒత్తిడి చేశారని అంటున్నాడు. సాహిల్ పిటిషన్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది.
పూర్తిగా చదవండి..Hyderabad : నేను కాదు యాక్సిడెంట్ చేసినది-మాజీ మంత్రి కొడుకు సోహెల్
పంజాగుట్ట కారు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. యాక్సిడెంట్తో తనకేం సంబంధం లేదంటూ మాజీ మంత్రి షకీల్ కొడుకు సోహెల్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించాడు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టేయాలని పిటిషన్ దాఖలు చేశాడు.
Translate this News: