2 Guarantees : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మరో రెండు పథకాల గృహజ్యోతి(Gruha Jyothi), 500రూ.లకే గ్యాస్ లను అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. వాస్తవానికి ఈ రెండు పథకాలు ఈరోజు రంగారెడ్డి చేవెళ్ళ(Chevella) లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే దీనికి ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా(Mahbubnagar) స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ఈసీ నిన్న విడుదల చేసింది. ఉమ్మడి జిల్లా పరిధిలోని షాద్ నగర్ ప్రాంతం.. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లాలో కలిసింది. దీంతో రంగారెడ్డి జిల్లాలో కూడా కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఈరోజు మధ్యాహ్నం రెండు పథకాలను సచివాలయంలోనే నిర్వహించనున్నారు. గృహజ్యోతి, 500రూ.లకే గ్యాస్ పథకాలను కాంగ్రెస్ అగ్రనేత.. ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. అయితే ఆమె వీటిని వర్చువల్గా స్టార్ట్ చేయనున్నారు.
పూర్తిగా చదవండి..Telangana : చేవెళ్ళ కాదు.. సచివాలయంలోనే రెండు గ్యారంటీల ప్రారంభం
గృహజ్యోతి, గ్యాస్ సిలెండర్ పథకాల ప్రారంభం వెన్యూ మారింది. ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో ఈ పథకాలను ఈరోజు మధ్యాహ్నం సచివాలయంలో ప్రారంభించనున్నారు. ప్రియాంక గాంధీ వీటిని వర్చువల్గా ఇనాగ్యురేట్ చేస్తారు.
Translate this News: