దేశ సరిహద్దుల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఏ సమయంలో ఉగ్రవాదులు దాడులు చేస్తారో ఊహించని పరిస్థితి ఉంటుంది. అయితే మనదేశ సరిహద్దులో ఉగ్రవాదులను హతం చేసే చర్యలు కొనసాగుతున్నాయి. తాజాగా పాకిస్థాన్ నుంచి భారత్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఈ ఘటన ఉత్తర కశ్మీర్లోని కుర్వారా అనే జిల్లాలో దేశ సరిహద్దు ప్రాంతంలో చోటుచేసుకుంది. సరిహద్దు అవతలి నుంచి చొరబాటుకు యత్నిస్తున్న ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు కాల్చేశాయి. అయితే ఆ దాడిలో హతమైన ఉగ్రవాదులకు లష్కరే తోయిబా అనే ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఇంకా ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారా అనే అనుమానంతో వారిని గుర్తించేందుకు రంగంలోకి దిగింది సైన్యం.
పూర్తిగా చదవండి..Terrorists: దేశ సరిహద్దులో సెర్చ్ ఆపరేషన్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం..
పాకిస్థాన్ నుంచి భారత్లోకి అక్రమంగా చొరబడేందుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. సరిహద్దు అవతలి నుంచి చొరబాటుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదుల్ని కాల్చేశాయి. పోలీసులు, సైన్యం సంయుక్త ఆపరేషన్తో ముష్కరుల కుట్రను భగ్నం చేశారు. ఇందులో హతమైన ఉగ్రవాదులకు లష్కరే తోయిబా అనే ఉగ్రసంస్థతో సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది.
Translate this News: