Crime News: దారుణం.. బతికుండగానే బిడ్డను పాతిపెట్టిన తండ్రి

పాకిస్థాన్‌లో దారుణం జరిగింది. బిడ్డ పుట్టిన 15 రోజులకే ఓ తండ్రి ఆ చిన్నారిని సజీవంగా పాతిపెట్టాడు. బిడ్డ ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో చికిత్సకు డబ్బులు లేకే ఈ పని చేశానంటూ పోలీసుల ముందు నేరం అంగీకరించాడు.

Murder: ఓరి దుర్మార్గుడా.. భార్యమీద కోపంతో రెండు నెలల బిడ్డను చంపిన కానిస్టేబుల్!
New Update

పెళ్లి తర్వాత బిడ్డకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవు. అయితే ఓ తండ్రి మాత్రం.. 15 రోజులు కూడా నిండని ఓ పసికందును బతికుండగానే పాతిపెట్టడం సంచలనం రేపింది. ఈ విషాద ఘటన పాకిస్థాన్‌లో జరిగింది. ఈ నేరం చేసినందుకు ఆ తండ్రి చెప్పిన కారణం విని పోలీసులు కూడా దిగ్భ్రాంతి చెందారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. పాకిస్థాన్‌లోని సింధ్ ప్రాంతంలో తయ్యబ్‌ అనే వ్యక్తి తన భార్యతో కలిసి ఉంటున్నాడు. 15 రోజుల క్రితం తన భార్య ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ తర్వాత చిన్నారి ఆరోగ్య పరిస్థతి సరిగా లేదు.

Also read: హెచ్‌ఐవీ నివారణకు మందు .. క్లినికల్ ట్రయల్స్‌లో 100 శాతం సక్సెస్

దీంతో తన బిడ్డకు చికిత్స చేయించేందుకు డబ్బు లేకపోవడం వల్లే.. బతికుండగానే గొయ్యితీసి పాతిపెట్టానని తయ్యబ్ నేరాన్ని ఒప్పుకున్నాడు. తన బిడ్డను ఒక గోనె సంచిలో తీసుకెళ్లి.. థారుశాహ్ అనే ప్రాంతంలో సమాధి చేశానని చెప్పాడు. అతడు నేరాన్ని ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు ఆదేశాల ప్రకారం ఫొరెన్సిక్ పరీక్ష కోసం ఆ సమాధినికి తవ్వనున్నారని అక్కడి స్థానిక మీడియా తెలిపింది. గతంలో కూడా పాకిస్థాన్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. బిడ్డ ముఖాకృతి సరిగా లేదని.. పుట్టిన రెండురోజులకే ఓ తండ్రి ఆ చిన్నారని సజీవంగా పాతిపెట్టాడు.

Also Read: ఆలయం బయట రాహుల్‌ ఫొటోతో డోర్‌మ్యాట్‌.. వీడియో వైరల్

#child-death #pakisthan-news #child #telugu-news #pakisthan
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి