ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొత్త కొత్త ఆవిష్కరణలను అభివృద్ధి చేస్తూ.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ వార్తల్లో కనిపిస్తూనే ఉంటారు. ఇటీవలే తమ న్యూరాలింక్ సంస్థ.. విజయవంతంగా ఓ మనిషి మెదడులో చిప్ను ప్రవేశపెట్టిందని.. అది స్పందిస్తుందని ప్రకటన చేసి మరోసారి సంచలనం సృష్టించారు. అయితే తాజాగా ఆయనకు ఓ సమస్య ఎదురైంది. ఇటీవలే ఆయన విండోస్ ల్యాప్టాప్ను కొనుగోలు చేశారు. అందులో మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ కావాల్సి వచ్చింది. కానీ మస్క్ విండోస్ అకౌంట్ క్రియేట్ చేసేందుకు ఇష్టపడలేదు. దీంతో తన సమస్యను ఎక్స్లో చెప్పారు. సరైన స్పందన రాకపోవడంతో.. చివరికి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదేళ్లకే మెసెజ్ పెట్టారు.
పూర్తిగా చదవండి..Elon Musk: ఆ సమస్యను పరిష్కరించండి.. సత్యనాదెళ్లకు ఎలాన్ మస్క్ మెసేజ్
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల విండోస్ ల్యాప్టాప్ను కొనుగోలు చేశారు. అయితే మైక్రోసాఫ్ట్ అకౌంట్తో లాగిన్ కావాల్సి ఉండటంతో తన సమస్యను మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదేళ్లకు మెసేజ్ పెట్టారు. మైక్రోసాఫ్ట్ అకౌంట్ లేకుండానే కంప్యూటర్ వినియోగించుకునే ఆప్షన్కు తీసుకురావాలని కోరారు.
Translate this News: