/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/35-1-jpg.webp)
BRS MLC Kavitha : పది రోజుల కస్టడీ ముగియడంతో బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్సీ కవితను ఈడీ(ED) అధికారులు ల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టుకు తరలించారు. కోర్టులో ఇరుపక్షాల లాయర్లు వాదనలు ముగిసాయి. కోర్టు తీరపును రిజర్వ్ చేసింది. తన కొడుక్కి వచ్చే నెల 16న పరీక్షలు ఉన్నాయని...అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత(Kavitha) లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా... మరో 15 రోజుల కస్టడీ కోసం ఈడీ వాదిస్తోంది. రౌస్ అవెన్యూ కోర్టులో కవితకు బెయిల్ రాకపోయినా.. కస్టడీ పొడిగించకపోయినా...ఆమె తీహార్ జైలుకు వెళ్ళే అవకాశాలున్నాయి.
తాను క్లీన్గా బయటకు వస్తా..
మరోవైపు తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తాను ఏ తప్పూ చేయలేదని... కచ్చితంగా బయటకు వస్తానని అంటున్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని...పొలిటికల్ లాండరింగ్ కేసని అంటున్నారు కవిత. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చేమో కానీ... తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఎవరూ దెబ్బ తీయలేరని చెప్పారు కవిత. ఇందులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీ(BJP) లో చేరాడు. మరో నిందితుడు బీజేపీ టికెట్ పొందాడు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) రూపంలో బీజేపీకి రూ.50కోట్లు ఇచ్చాడని చెప్పుకొచ్చారు. అయితే ఎవరు ఎలా ఉన్నా... తాను మాత్రం క్లీన్గా బయటికొస్తానని ఈడీ అధికారులు ఆమెను కోర్టుకు తరలిస్తున్న సమయంలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. దాంతో పాటూ జై తెలంగాణ, జై కేసీఆర్ అంటూ నినాదాలు కూడా చేశారు.
Also Read : Visakha Patnam: నా కెరీర్ నాశనం చేశారు..వాళ్ళని వదలను-సౌమ్యశెట్టి