Bhatti Fire On KCR : తెలంగాణలో కాంగ్రెస్(Telangana Congress) ప్రభుత్వం అధికారంలోకి రావడంతో.. సీఎంగా రేవంత్ రెడ్డి(Revanth Reddy) తో పాటు మరో 11 మంది మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత.. మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేయడం, ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10.లక్షలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని చెప్పారు. అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అంతా అస్తవ్యస్థమేనని.. రాష్ట్రం వెనుకబడిందంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందంటూ ధ్వజమెత్తారు. నియంతృత్వ పాలకు ప్రజలు చరమగీతం పాడారని.. తమ కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థ ప్రజల కోసమే పనిచేసేలా చేస్తామని పేర్కొన్నారు.
పూర్తిగా చదవండి..Bhatti Vikramarka : కేసీఆర్ పాలన అంతా అస్తవ్యస్థమే.. భట్టి ఫైర్..
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై త్వరలోనే శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో అంతా అస్తవ్యస్థమేనని.. రాష్ట్రం వెనుకబడిందంటూ మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో ఫ్యూడల్ వ్యవస్థ ఏర్పడిందంటూ ధ్వజమెత్తారు.
Translate this News: