Telangana : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అమిత్ షా ఫేక్ వీడియో కేసులో సీఎంతో పాటు పలువురికి సమన్లు ఇచ్చారు. మే 1న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు.రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు ఇచ్చారు.

New Update
Telangana : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల సమన్లు

Revanth Reddy : తెలంగాణ(Telangana) సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసులు(Delhi Police) సమన్లు జారీ చేశారు. అమిత్ షా(Amit Shah) ఫేక్ వీడియో కేసులో సీఎంతో పాటు పలువురికి సమన్లు ఇచ్చారు. మే 1న విచారణకు రావాలని తెలిపారు.రిజర్వేషన్ల అంశంలో అమిత్ షా ఫేక్ వీడియోను షేర్ చేశారంటూ పలువురు కాంగ్రెస్(Congress) నేతలకు సమన్లు ఇచ్చారు. ఢిల్లీ నుంచి 8 మంది అధికారుల బృందం హైదరాబాద్‌కు చేరుకున్నారు. వీరు గాంధీ భవన్‌కు చేరుకుని అక్కడ సీఎం రేవంత్ రెడ్డితో పాటూ కాంగ్రెస్ నేతలకు నోటీసులు ఇచ్చారు. వీరితో పాటూ తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా ఇంఛార్జ్‌కు సీఆర్పీ 81 కింద నోటీసులు ఇచ్చారు ఢిల్లీ పోలీసులు.

రిజర్వేషన్లు రద్దు మీద అమిత్ షా మాట్లాడినట్లు మార్ఫింగ్ చేసిన వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరల్ అవుతున్న వీడియోను బీజేపీ సీరియస్‌గా తీసుకుంది. ఈ అంశంపై వేగంగా విచారణ చేయాలని పోలీసులకు కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు ఈ వీడియోను తెలంగాణ కాంగ్రెస్ క్రియెట్ చేసిందని బీజేపీ నేతలు అనుమానిస్తున్నారు. తెలంగాణలో జరిగిన విజయ్ సంకల్ప్ సభలో అమిత్ షా మాట్లాడిన మాటలే మార్ఫింగ్ చేయడం… ఈ మధ్య కాలంలో రిజర్వేషన్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా బీజేపీ మీద ఆరోపణలు చేస్తుండడమే వారి అనుమానాలకు కారణమైంది. ఈ నేపథ్యంలో  కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నుంచి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు అందింది.  దీంతో పాటూ మార్ఫింగ్ వీడియో మీద ప్రధాని మోదీ కూడా ఫైర్ అవుతున్నారు. ఎన్నికల్లో ఓడిపోయే వారే ఇలాంటి పనులు చేస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేసేవారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దాంతో పాటూ ఇండియా కూటమి నేతలు ఫేక్ వీడియోలు వ్యాప్తి చేస్తున్నారని ప్రధాని మండిపడ్డారు. 

Also Read:Delhi High Court: ప్రధాని మోదీకి బిగ్ రిలీఫ్..అనర్హత పిటిషన్‌ను కొట్టేసిన ఢిల్లీ హైకోర్టు

Advertisment
తాజా కథనాలు