ఢిల్లీ రాజిందర్నగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. రావ్ ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అక్కడి విద్యార్థులు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ స్నేహితులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపిస్తున్నారు. చిన్నపాటి వర్షాలకే వరదలు వస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. 12 రోజుల క్రితమే ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ దారుణంగా ఉందని కౌన్సిలర్కు ఫిర్యాదు చేశామని.. వాళ్లు వెంటనే చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Coaching Centre Tragedy: ఢిల్లీ కోచింగ్ సెంటర్ విషాద ఘటన.. విద్యార్థుల నిరసనలు
ఢిల్లీలోని ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరద పోటెత్తడంతో ముగ్గురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అక్కడి విద్యార్థులు నిరసనలు చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Translate this News: