/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/rajnath-singh-jpg.webp)
Rajnath Singh: భారత రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం లడఖ్లోని లేహ్లో సైనికులతో కలిసి హోలీ వేడుకలు జరుపుకున్నారు. సైనిక స్థావరాన్ని సందర్శించిన ఆయన సైనికలతో కలిసి రంగలు పూసుకున్నారు. ఈ సందర్భంగా జవాన్లు, ఇతర సీనియర్ సిబ్బందితో మాట్లాడారు. 'ఢిల్లీ మనదేశ రాజధాని, ముంబయి మన ఆర్థిక రాజధాని. అలాగే లడఖ్ మన శౌర్యానికి రాజధాని' అని అన్నారు. హోలీ పండుగ కోసం ఈ ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు.
Also read: అలా చేస్తే రాజకీయాల్లో నుండి తప్పుకుంటా.. ఈటల సంచలన సవాల్
సైనికులకు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని అన్నారు. వారి సాహసం, త్యాగాలు రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటాయని అన్నారు. వాస్తవానికి రాజ్నాథ్ సింగ్ షెడ్యూల్ ప్రకారం సియాచిన్ ప్రాంతానికి వెళ్లాల్సి ఉంది. కానీ అక్కడ వాతావరణం అనుకూలించకపోవడంతో.. ఆయన పర్యటన రద్దయ్యింది. దీంతో సియాచిన్ కమాండింగ్ ఆఫీసర్తో రాజ్నాథ్ సింగ్ ఫోన్లో మాట్లాడారు. త్వరలోనే సియాచిన్లో విధులు నిర్వహిస్తున్న సైనికులకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. త్వరలోనే వారని కలుస్తానని హామీ ఇచ్చారు.
Delighted to celebrate Holi with the soldiers of Indian Armed Forces in Leh, Ladakh. pic.twitter.com/lgff7UXxhA
— Rajnath Singh (मोदी का परिवार) (@rajnathsingh) March 24, 2024