ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా…అంటే అవుననే చెప్పాలి. ఈరోజు తెల్లవారి నుంచి సంజయ్ సింగ్ ఇంట్లో కేంద్ర ద్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిర్వహిస్తున్న సోదాలే ఇందుకు ఉదాహరణ. మనీ లాండరింగ్ కేసుతో సంబంధం ఉన్న అనుమానంతోనే సోదాలు నిర్వహిస్తున్నామని చెబుతున్నారు ఈడీ అధికారులు. దాంతో పాటూ బిజినెస్ మ్యాన్ దినేశ్ అరోరాతో కూడా సంజయ్ కు సంబంధాలున్నట్లు ఈడీ గుర్తించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్ర రెడ్డి, దినేశ్ అరోరా, మాగుంట రాఘవలు అప్రూవర్లుగా మారి కీలక సమాచారాలు అందించారు. ఈ నేపథ్యంలో సంజయ్ ఇంట సోదాలు ప్రధాన్యతను సంతరించుకున్నాయి.
పూర్తిగా చదవండి..delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ కేసులో ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు
ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. నార్త్ అవెన్యూలోని ఎంపీ నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. దీంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కేంద్ర దర్యాప్తు సంస్థ మళ్ళీ దూకుడు పెంచినట్టు అయింది.
Translate this News: