Honeymoon Couple Missing: మరో హనీమూన్‌ జంట మిస్సింగ్..

హనీమూన్‌ కోసం సిక్కిం వెళ్లిన నవదంపతులు గల్లంతైన ఘటన సంచలనంగా మారింది. వారు ప్రయాణిస్తున్న కారు ప్రమాదవశాత్తూ తీస్తా నదిలో పడిపోవడంతో కనిపించకుండాపోయారు. ఆ సమయంలో వీరితో పాటు మరో 9 మంది ఉన్నట్లు సమాచారం. వారిలో ఇద్దరిని రక్షించగా, డ్రైవర్‌ మృతి చెందారు.

New Update
UP Couple On Honeymoon Missing After Car Falls 1,000 Feet Into Sikkim River

UP Couple On Honeymoon Missing After Car Falls 1,000 Feet Into Sikkim River

Honeymoon Couple Missing: ఇటీవల హనీమూన్​కోసం మధ్యప్రదేశ్​(Madhya Pradesh)నుంచి మేఘాలయకు(Meghalaya) వెళ్లిన రాజ రఘవంశీ, అతడి భార్య సోనమ్ దంపతులు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అనంతరం రాజ మరణించాడు. అతడిని తన భార్య సోనమ్ హత్య చేయించినట్లు పోలీసులు ఇవాళ తెలిపారు. ఆమెను అరెస్టు చేశారు. ఇక ఈ హనీమూన్ ఘటన మరువక ముందే.. మరో ఇన్సిడెంట్ సంచలనంగా మారింది. 

Also Read: ఏపీలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

హనీమూన్‌కు వెళ్లి మిస్సింగ్

హనీమూన్‌‌కు వెళ్లిన మరో జంట కనిపించకుండా పోయింది. ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన నవ దంపతులు సిక్కింలోని తీస్తా నదిలో కనిపించకుండా పోయారు. ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. 

యూపీలోని ప్రతాప్‌గఢ్ జిల్లాకు చెందిన కౌశలేంద్ర ప్రతాప్‌ సింగ్‌కు అంకితా సింగ్‌ అనే యువతితో గత నెల 5న (మే 5) మ్యారేజ్ అయ్యింది. ఈ నవ దంపతులు హనీమూన్‌ కోసం మే 24న సిక్కిం వెళ్లారు. అనంతరం పలు ప్రాంతాలు తిరిగారు. అయితే అనుకోని మృత్యువు వారిని వెంటాడింది. మే 29న వారు ప్రయాణిస్తున్న కారుపై కొండ చరియలు విరిగిపడ్డాయి. 

Also Read: సవకే సవక.. రూ.14వేల భారీ డిస్కౌంట్ - 8GB ర్యామ్, 50MP కెమెరా ఫోన్‌ తక్కువకే!

దీంతో వారు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి తీస్తా నదిలో పడిపోయింది. అయితే అప్పటికే వీరు ప్రయాణిస్తున్న కారులో దాదాపు 9 మంది ఉన్నట్లు సమాచారం. ఇక కొండ చరియలు విరిగి పడటంతో ఆ కారు 1,000 అడుగుల లోతున్న నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ కారులో ఉన్నవారంతా గల్లంతయ్యారు. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు అప్పటికి ఇద్దరిని రక్షించారు. 

Also Read: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

అందులో డ్రైవర్‌ మృతి చెందాడు. గల్లంతైన మరో 8 మంది ఆచూకీ కోసం ఎన్డీఆర్‌ఎఫ్‌, అగ్నిమాపక, అటవీ శాఖ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. అయితే గల్లంతైన వారిలో ఒడిశాకు చెందినవారు 4గురు, త్రిపురకు చెందినవారు ఇద్దరు అని తెలిసింది. ఇక ఈ ఘటన జరిగి దాదాపు 12 రోజులు అయినా.. ఇంకా ఎలాంటి అప్డేట్ లేదని నవ వరుడు కౌశలేంద్ర ప్రతాప్ సింగ్ తండ్రి షేర్ బహదూర్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. 12 రోజులు అవుతున్నా తన కుమారుడు, కోడలి ఆచూకీ లభించలేదని కన్నీరుమురన్నీరయ్యారు. 

Also Read: అయ్యో బిడ్డా.. తెలంగాణ యువకుడి ప్రాణం తీసిన ట్రిమ్మర్

Advertisment
Advertisment
తాజా కథనాలు