TG Crime: కేటీఆర్ ఇలాకాలో ఘోరం.. ఆ గుడిముందు మహిళ తల, చేతులు నరికేసిన యువకుడు!

సిరిసిల్లలో దారుణం జరిగింది. చందుర్తి గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ(60)ను అదే గ్రామానికి చెందిన మనోజ్ పెద్దమ్మ గుడి ముందు వేట కొడవలితో నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి.. ఆమె తల, చేతులు నరికేసినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు.

New Update
murder

Siricilla Young man hacks woman

TG Crime: సిరిసిల్లలో దారుణం జరిగింది. చందుర్తి గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ(60)ను అదే గ్రామానికి చెందిన మనోజ్ అనే యువకుడు పెద్దమ్మ గుడి ముందు వేట కొడవలితో నరికి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమె తల, చేతులు నరికేసినట్లు నేరం అంగీకరించి లొంగిపోయాడు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలోనూ మనోజ్‌పై మర్డర్ కేసుఉన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఇది కూడా చూడండి: BIG BREAKING: సంచలన అప్‌డేట్‌.. పుతిన్‌ హెలికాప్టర్‌పై ఉక్రెయిన్‌ బాంబు దాడి !

ఇదిలా ఉంటే.. సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. న్యాల్‌కల్‌ మండలం రుక్మాపూర్‌లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. రాణెమ్మ(48) అనే ఒంటరి మహిళను దుండగులు డబ్బు కోసం దారుణంగా చంపేశారు. ఆమె ఇంట్లోకి చొరబడి బంగారం, నగదు తీసుకుని ఆపై ఆమెను సీసాతో పొడిచి దారుణంగా హత్య చేశారు. వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: BJP Leader Video viral: యువతితో అడ్డంగా బుక్కైన మరో BJP లీడర్.. ఈసారి పార్టీ ఆఫీస్‌లోనే (VIDEO)

ఆదివారం ఉదయం హైదరాబాద్‌ సమీపంలోని ఘట్‌కేసర్‌ రైల్వే స్టేషన్‌ వద్ద జరిగిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆనందంగా స్వగ్రామానికి వెళ్లే ప్రయాణం ఒక్కసారిగా విషాదంగా మారింది. అనకాపల్లి జిల్లా దొండపూడి గ్రామానికి చెందిన మట్ట వెంకటేశ్‌,శ్వేత (33) దంపతులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పనిచేస్తున్న వెంకటేశ్‌ వేసవి సెలవుల సందర్భంగా తన భార్య శ్వేత, ఇద్దరు పిల్లలను స్వగ్రామానికి పంపించాలనుకున్నారు. కానీ ఆ తల్లి కన్నపిల్లల కళ్ల ముందే రైలు ప్రమాదంలో మృతి చెందింది.

women | murder | boy | telugu-news | today telugu news 

 

Advertisment
Advertisment
తాజా కథనాలు