పహల్గాం ఉగ్రదాడి.. వెలుగులోకి వచ్చిన మరో విషాదగాథ

పహల్గాం ఉగ్రదాడిలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీకి రెండేళ్ల కిందట వివాహం జరిగింది. యూఏఈలో ఉంటున్న నీరజ్ ఇండియా వచ్చి వెకేషన్ కోసం భార్యతో కలిసి జమ్మూ కశ్మీర్‌లోకి పహల్గాం వెళ్లగా ఉగ్రదాడి జరిగింది.

New Update
Jaipur udwani

Jaipur udwani

జమ్మూ కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ఇప్పటి వరకు 28 మంది మృతి చెందారు. ఈ ఉగ్రదాడిలో ఎన్నో అందమైన జంటలు బలి అయ్యాయి. కొత్త పెళ్లయిన జంటలు తన భాగస్వామితో వెకేషన్‌కి వెళ్లగా.. దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఉగ్రదాడిలో మరో విషాదగాథ వెలుగులోకి వచ్చింది. జైపూర్‌కు చెందిన నీరజ్ ఉద్వానీ అనే వ్యక్తికి రెండేళ్ల కిందట వివాహం జరిగింది.

ఇది కూడా చూడండి: TG Crime: కోడలిపై మోజుతో కొడుకును లేపేసిన తండ్రి.. రోకలి బండతో కొట్టి చంపి!

ఇది కూడా చూడండి: Betting Apps Pramotion Case : ప్రభుత్వం సంచలన నిర్ణయం..సెలబ్రిటీ బెట్టింగ్ యాప్స్ కేసు సీఐడీకి బదిలీ

వివాహం కోసం ఇండియాకి రాగా..

యూఏఈలో ఉంటున్న నీరజ్ ఓ వివాహం ఉందని ఇండియాకి వచ్చారు. ఈ క్రమంలో భార్యతో కలిసి జమ్మూ కశ్మీర్‌లోకి పహల్గాం వెళ్లగా.. ఉగ్రదాడికి పాల్పడ్డారు. అయితే నీరజ్ చిన్నతనంలో తండ్రి మృతి చెందగా.. తల్లి కష్టపడి చదివించింది. ఇప్పుడు నీరజ్ కూడా చనిపోవడంతో తల్లి, భార్య కన్నీరుమున్నీరవుతున్నారు. 

ఇది కూడా చూడండి: Sunstroke: వడదెబ్బకు ఏడుగురు మృతి.. మరో రెండ్రోజులు వడగాల్పులు

Advertisment
Advertisment
తాజా కథనాలు