HYD CRIME: రూ.4 లక్షలు ఇస్తేనే బిల్డింగ్ పర్మిషన్.. ACBకి అడ్డంగా దొరికిన మహిళా ఆఫీసర్!-VIDEO

నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్‌లో ఒక ప్లాట్‌కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.4 లక్షలు లంచం తీసుకోవడంతో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

New Update
Hyderabad

Hyderabad

నార్సింగి మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారిణిగా ఉన్న మణిహారిక ఏసీబీ వలలో పడింది. నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల రాధ రియల్టర్ వెంచర్‌లో ఒక ప్లాట్‌కు ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) క్లియరెన్స్ ఇచ్చేందుకు మణిహారిక రూ.10 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.4 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వినోద్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఈ ఆపరేషన్ నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ శ్రీధర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కార్యాలయంలో ప్రస్తుతం సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో అధికారులు లంచాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. 

ఇది కూడా చూడండి: Crime News : నంద్యాలలో భార్య గొంతు కోసి చంపిన భర్త

ఇది కూడా చూడండి: UP Crime: దారుణం.. మహిళకు నిప్పంటించిన దుండగుడు.. మంటల్లో కాలుతూనే స్కూటీపై

Updating..

Advertisment
తాజా కథనాలు