Meghalaya honeymoon murder: రాజా రఘువంశీ అంత్యక్రియల్లో సోనమ్‌ ప్రియుడు (వీడియో)

రాజా రఘువంశీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాజా మృతదేహం ఇండోర్‌కు వచ్చిన రోజు సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా కూడా అక్కడే ఉన్నాడని తెలిసింది. అతను రాజా అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడని రఘవంశీ పొరుగువారు షాకింగ్ విషయాలు చెప్పారు.

New Update
Meghalaya honeymoon murder

Meghalaya honeymoon murder

హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లిన రాజా రఘువంశీ హత్య కేసులో అతని భార్య సోనమ్‌తో సహా నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. షిల్లాంగ్ పోలీసులు ఘాజీపూర్‌కు చేరుకుని సోనమ్‌ను పట్టుకున్నారు. ఇప్పుడు ఆమెను ట్రాన్సిట్ రిమాండ్‌కు తరలించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

Also Read :  తొక్కిసలాట ఘటన.. కర్ణాటక సర్కార్‌ కీలక నిర్ణయం

హనీమూన్ కేసులు సంచలన విషయాలు

ఈ నేపథ్యంలో రాజా రఘువంశీ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోనమ్ ప్రియుడు రాజ్ కుష్వాహా గురించి రాజా రఘువంశీ పొరుగువారు సంచలన విషయాలు వెల్లడించారు. రాజా రఘువంశీ కుటుంబాన్ని రాజ్ కుష్వాహ ఎలా మోసం చేశాడు.. సోనమ్‌తో అతనికి ఉన్న సంబంధం ఏంటి? అనేది వారు తెలిపారు. 

Also Read: విమానం మెట్లు ఎక్కుతుండగా జారిపడ్డ ట్రంప్.. వీడియో వైరల్

ఇండోర్‌లోని రాజా రఘువంశీ పొరుగువారు మాట్లాడుతూ.. రాజ్ కుష్వాహా సోనమ్ ఇంటికి తరచుగా వచ్చేవాడని చెప్పారు. రాజా రఘువంశీ మృతదేహం ఇండోర్‌కు వచ్చిన రోజు.. రాజ్ కుష్వాహా కూడా అక్కడే ఉన్నాడని తెలిపారు. అతను రాజా అంత్యక్రియలకు కూడా హాజరయ్యాడని షాకింగ్ విషయాలు చెప్పారు. సోనమ్ పొరుగువారిని తన కారులో అంత్యక్రియలకు తీసుకెళ్లాడని తెలిపారు. 

Also Read: లాస్‌ఏంజెల్స్‌లో ఆందోళనలు.. రిపోర్టర్‌ కాలికి తగిలిన రబ్బరు తుటా (VIDEO)

తాజా సమాచారం ప్రకారం.. సోనమ్, రాజ్ కుష్వాహా చాలా కాలంగా ప్రేమ వ్యవహారం నడిపినట్లు సమాచారం. సోనమ్ సోదరుడి ప్లైవుడ్ వ్యాపారంలో రాజ్ మేనేజర్‌గా కూడా ఉండేవాడని తెలిసింది. 

మరోవైపు రాజా రఘువంశీ తల్లి మాట్లాడుతూ.. సోనమ్ తరచూ అస్సాం, మేఘాలయకు వెళ్దామని రాజా రఘువంశీని అడిగేదని.. అతడు దానికి నిరాకరించినప్పటికీ సోనమ్ పట్టుబట్టడంతో రాజా రఘువంశీ ఒప్పుకున్నాడని తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు