TG News: అయ్యో పాపం! పెళ్ళైన 14 రోజులకే వరుడు మృతి.. ఏమైందంటే

మెదక్ జిల్లా అంసానిపల్లిలో పెళ్ళైన 14 రోజులకే నవవరుడు సాయి కిరణ్ గుండెపోటుతో మృతి చెందాడు. ఉదయాన్నే లేచి స్నానం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సాయికిరణ్ కి గతనెల 21న అదే గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది.

New Update
medak incident newlywed man died with heart stroke

medak incident newlywed man died with heart stroke

TG News:  ఈ మధ్య కాలం వయసుతో సంబంధం లేకుండా చాలా మంది సడెన్ హార్ట్ ఎటాక్స్ తో అకాల మరణానికి గురవుతున్నారు.తాజాగా మెదక్ జిల్లా అంసానిపల్లిలో ఇలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. పెళ్ళైన 14 రోజులకే నవ వరుడు గుండెపోటుతో తనువు చాలించాడు. దీంతో ఒక్కసారిగా ఆ కుటుంబంలో, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

Also Read :  బాలయ్యకు అవార్డుల పంట.. సర్ప్రైజ్ అవార్డుతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ!

స్నానం చేస్తుండగా..

అంసానిపల్లికి చెందిన అక్కమొల్ల సాయికిరణ్ గతనెల 21న అదే గ్రామానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. అయితే సాయి కిరణ్ గురువారం రాత్రి ఓ పెళ్లి కార్యక్రమానికి బ్యాడ్ కొట్టేందుకు వెళ్ళాడు. ఆ తర్వాత అర్థరాత్రి సమయంలో ఇంటికి వచ్చి బాగానే పడుకున్నాడు. కానీ ఉదయం లేచేసరికి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు సాయి కిరణ్. ఉదయాన్నే లేచి స్నానం చేస్తుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. 

వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లిన ప్రయోజనం లేకపోయింది. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. పెళ్ళైన 14 రోజులకే సాయి కిరణ్ అకాల మరణంతో కట్టుకున్న భార్య, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Also Read: BJP Leader Missing: వ్యాన్ నదిలో పడి బీజేపీ నాయకురాలు గల్లంతు.. మరో 8మంది

Advertisment
Advertisment
తాజా కథనాలు