Medak Crime
Medak Crime: మాట వినడం లేదని, చెడు అలవాట్లకు బానిసయ్యాడని కన్న కొడుకును కడ తెర్చుకున్నాడు ఓ తండ్రి. కొడుకును కత్తితో పొడిచి చంపి పోలీసులకు లొంగిపోయాడు. ఈ విషాదకరమైన ఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో చోటుచేసుకుంది.
Also Read: Hari Hara Veera Mallu: పవన్ ఫ్యాన్స్ కి పూనకాలే.. 'హరిహర వీరమల్లు' లో పవన్ పాడిన పాట వచ్చేసింది!
మద్యం, గంజాయి తీసుకుంటూ..
మనోహరాబాద్ మండలం లింగారెడ్డిపేటలో దుర్గయ్య అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడికి ఒక శ్రీకాంత్ అనే కొడుకు ఉన్నాడు. అయితే ఏ పని చేయకుండా మద్యం, గంజాయి తీసుకుంటూ జులాయిగా తిరుగుతు తల్లిదండ్రులను వేధించేవాడట. తాగొద్దని మందలించిన ప్రతిసారి తిరిగి తండ్రినే చంపుతానని బెదిరించేవాడు. ఇలా రోజులు గడవడంతో విసుగు చెందిన తండ్రి దుర్గయ్య నిన్న రాత్రి కొడుకును కత్తితో పొడిచి చంపాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.
Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ పై కుట్ర చేసింది వీళ్లే.. ఆరుగురి అరెస్ట్!
నూజివీడులో మరో ఘటన
ఇది ఇలా ఉంటే.. ఆంద్రప్రదేశ్ నూజివీడు మండలంలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి కొడుకును కర్రతో కొట్టి చంపాడు. పోలీసుల వివరాల ప్రకారం.. మంగళవారం తండ్రి గోవింద్, కొడుకు నాగభూషణం మద్యం తాగి ఉన్నారు. ఈ సమయంలో నాగభూషణం తండ్రిని డబ్బులు కావాలని అడగ్గా.. తండ్రి తన వద్ద లేవని చెప్పాడు. దీంతో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో గోవింద్ కొడుకు తలపై కర్రతో కొట్టాడు. దెబ్బ బలంగా తాకడంతో కొడుకు అక్కడిక్కడే మృతి చెందాడు. కొడుకు నాగభూషణంకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read : కేజ్రీవాల్కు బిగ్ షాక్.. ఆ కేసులో విచారణకు హోంశాఖ గ్రీన్ సిగ్నల్
Also Read: Life Style: ప్రపంచ చెత్త ఆహారాల జాబితాలో ఒకే ఒక్క ఇండియన్ ఫుడ్.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఆగ్రహం!