/rtv/media/media_files/2025/02/19/nSIg7gqU4HW8lC1xHiE5.webp)
Maharashtra woman murder
Women Murder: మహారాష్ట్రాలో దారుణం జరిగింది. థానే జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు ఒక మహిళ(35)ను గొంతు కోసి చంపేశారు. మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసి పారిపోయారు. కొద్దిరోజుల క్రితం ఆమె బంధువులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
సమీపంలోని వ్యక్తుల సహాయం..
ఈ మేరకు ఆ మహిళ వయస్సు 35 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె మృతదేహం శుక్రవారం భివాండిలోని ఠాకూర్గావ్ ప్రాంతంలో లభ్యమైందని చెప్పారు. మరణించిన మహిళను ఇంకా గుర్తించలేదని, ఆ మహిళను గుర్తించడానికి సమీపంలోని వ్యక్తుల సహాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. సమీపంలోని సీసీటీవీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నామని, గత కొన్ని సంవత్సరాల కిందట ఆమె తప్పిపోయినట్లు దాఖలైన ఫిర్యాదులను కూడా పరిశీలిస్తున్నామన్నారు.
Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత
ప్రాథమిక దర్యాప్తులో మహిళ గొంతు కోయడం వల్లే మరణించిందని తేలింది. ఈ కేసులో కొంగావ్ పోలీస్ స్టేషన్లో హత్య కేసుగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం పంపించాం. బాధితుడిని గుర్తించడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారి తెలిపారు. ఆమె ఎవరు? ఆ హత్య ఎవరు చేశారు? దీనికి సంబంధించి దర్యాప్తు జరుగుతోందని, విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు.
Also read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ
maharastra | Women Killed Brutally | telugu-news | today telugu news