Pakistan terrorist : పాకిస్తాన్‌లో హత్యకు గురైన లష్కరే తోయిబా ఉగ్రవాది

లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ శనివారం రాత్రి పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు. అబూ ఖతల్ ప్రయాణిస్తున్న కారులో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు చేశారు. పాకిస్థాన్ పంజాబ్‌లోని జీలం టౌన్‌లో అతనితోపాటు అనుచరుడిని కూడా కాల్చి చంపారు. 

New Update
Abu Qatal 1233

Abu Qatal 1233 Photograph: (Abu Qatal 1233)

లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ శనివారం రాత్రి పాకిస్తాన్‌లో హత్యకు గురయ్యాడు. ఉగ్రవాద సంస్థకు కీలక కార్యకర్త అయిన ఖతల్ జమ్మూ కాశ్మీర్‌లో అనేక దాడులకు ప్లాన్ చేశాడు. అబూ ఖతల్ ప్రయాణిస్తున్న కారులో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు చేశారు. పాకిస్థాన్ పంజాబ్‌లోని జీలం టౌన్‌లో అతనితోపాటు అనుచరుడిని కూడా కాల్చి చంపారు. 

Also read: US airstrikes: అమెరికా వైమానిక దాడిలో 19 మంది మృతి!

జూన్ 9న రియాసిలో యాత్రికులపై జరిగిన దాడికి ఖతల్ నాయకత్వం వహించాడు. 2023 రాజౌరి దాడికి NIA అతనిపై అభియోగం మోపింది. 26/11 ముంబై ఉగ్రవాద దాడి సూత్రధారి హఫీజ్ సయీద్‌కు సన్నిహితుడైన అబూ కతల్, జూన్ 9న రియాసిలోని శివ్ ఖోరి ఆలయం నుండి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై జరిగిన దాడిలో కీలక పాత్ర పోషించాడు. ఖతల్ నాయకత్వంలో ఈ దాడి జరిగింది.

2023 రాజౌరి దాడిలో అబూ ఖతల్ పాత్ర ఉందని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన ఛార్జిషీట్‌లో పేర్కొంది. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన అనేక ఉగ్రవాద సంఘటనలలో అతని పాత్ర కోసం సైన్యంతో సహా అనేక భద్రతా సంస్థలు అతనిని ట్రాక్ చేస్తున్నాయి.

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు