స్టార్ హోటల్‌లో కాంగ్రెస్ నాయకురాలిపై గ్యాంగ్ రేప్!

జైపూర్‌లో కౌన్సిలర్ టికెట్ ఇస్తామని కాంగ్రెస్ నాయకురాలిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన జరిగింది. ముగ్గురు యువకులు కలిసి ఆమెను ఓ స్టార్ హోటల్‌కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి హత్యచారం చేశారు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.

New Update
Madhya Pradesh Crime News

Jaipur Gangrape

కాంగ్రెస్ నాయకురాలిపై కార్యకర్తలపై సామూహిక అత్యాచారం చేసిన దారుణ ఘటన జైపూర్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జైపూర్‌లోని ఓ మహిళ కాంగ్రెస్ కార్యకర్తకు పౌర ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్ ఇప్పిస్తానని చెప్పి ముగ్గురు యువకులు కలిసి ఒక హోటల్‌కు తీసుకెళ్తారు.

ఇది కూడా చూడండి: Heavy rains: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు, మెరుపులతో

కౌన్సిలర్ టికెట్ ఇప్పిస్తామని చెప్పి..

కౌన్సిలర్ టికెట్ కోసం ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు కూడా కాల్ చేశారు. బిజీ షెడ్యూల్ కారణంగా ఆ ఎమ్మెల్యే కాల్ లిఫ్ట్ చేయలేదు. దీంతో ముగ్గురు కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెకు మత్తుమందు ఇచ్చి సాముహిక అత్యాచారం చేశారు. దీంతో బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!

ఇదిలా ఉండగా విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన జరిగింది. చదువు చెప్పాల్సిన గురువే ఓ విద్యార్థిని పాలిట శాపం అయ్యాడు. నైతిక విలువలు నేర్పించాల్సిన గురువు మైమరిచి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని భవానీపురం జోజినగర్‌కు చెందిన పుల్లేటికుర్తి భువనచంద్ర (31) తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ స్కూల్‌లో చదువుతున్న ఓ పదో తరగతి బాలిక స్పెషల్ క్లాస్‌కు వెళ్లింది. ఈ సమయంలో ఉపాధ్యాయుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు.

ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్

దీంతో బాలిక భయపడి.. స్కూలు మొదటి అంతస్తు నుంచి కిందికి దూకేసింది. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఉపాధ్యాయుడు నేరం చేసినట్లు రుజువు కావడంతో పది సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెల్లడించారు. ఈ జరిమానాలో రూ.10 వేలు, నష్టపరిహారం కింద రూ.3 లక్షలు బాధితురాలికి అందజేయాలని డిస్ట్రిక్ట్‌ లీగల్‌సెల్‌ అథారిటీని న్యాయమూర్తి ఆదేశించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు