Hyderabad: అయ్యో.. ఆ రాక్షడు నా చెల్లిని కొట్టి చంపాడు.. మలక్‌పేట శిరీష కేసులో బిగ్ ట్విస్ట్!

హైదరాబాద్ మలక్‌పేటలో వివాహిత శిరీష అనుమానాస్ప మృతి కలకలం రేపుతోంది. తాజాగా ఈ కేసుకు సంబంధించిన మృతురాలు శిరీష మరో సంచలన విషయం బయటపెట్టింది. భర్తే తన చెల్లిని కొట్టి చంపినట్లు తెలిపింది.

New Update

Hyderabad:  మలక్‌పేటలోని జమున టవర్స్ లో భర్త, అత్తా మామలతో కలిసి నివాసముంటున్న వివాహిత శిరీష అనుమానాస్పదంగా మృతి చెందడం కలకలం రేపుతోంది. శిరీష గుండెపోటుతో మరణించిందని చెప్పగా.. ఆమె కుటుంబ సభ్యులు మాత్రం తమ కూతురిది సహజ మరణం కాదని.. అత్తింటివారే చంపారని ఆరోపించారు. 

Also Read: Kiran Abbavaraam: 'దిల్రుబా' స్టోరీ చెప్పు.. అదిరిపోయే బైక్ పట్టు.. కిరణ్ అబ్బవరం బంపర్ ఆఫర్!

చంపింది ఆ రాక్షసుడే 

అయితే  తాజాగా ఆర్టీవీ రిపోర్ట్ తో స్వయంగా మాట్లాడిన మృతురాలి అక్క మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టింది. శిరీషను తన భర్తే కొట్టి చంపాడని.. ఆమె శరీరంపై గాయాలు కూడా ఉన్నాయని తెలిపారు.  "గతంలో కూడా ఒక సారి గొడవ జరిగితే నా చెల్లిని నాతో పాటు తీసుకెళ్తానని చెప్పాను.. కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. ఆ తర్వాత గొడవలు తగ్గిపోయాయి.. ఇక అంతా బాగానే ఉంది కదా అనుకున్నాం.. కానీ ఇలా మా చెల్లిని మాకు లేకుండా చేశారు. ఇటీవలే ఫోన్ లో మాట్లాడినప్పుడు కూడా ఇంట్లో టార్చర్ ఎక్కువైనట్లు  చెప్పింది. భర్త, అత్తమామలు కలిసి నా చెల్లిని ప్లాన్ ప్రకారం మర్డర్ చేశారు.  చిన్నవయసులోనే మా అమ్మ నాన్న చనిపోయారు. ఎంతో కష్టపడి మా సొంత కాళ్లపై నిలబడ్డాము.  కానీ ఈరోజు మా చెల్లిని దూరం చేశారు అంటూ ఆమె అక్క కన్నీళ్లు పెట్టుకుంది.''  పూర్తి వివరాల కోసం పై వీడియో చూడండి. 

Also Read: Oscar Awards 2025: వేశ్యతో ప్రేమలో పడిన కథ.. 'అనోరా' చిత్రానికి ఏకంగా ఐదు కేటగిరీల్లో ఆస్కార్ అవార్డు!

Also Read: Oscar Awards 2025: జస్ట్ మిస్.. ప్రియాంక చోప్రా 'అనుజ' ను బీట్ చేసిన డచ్ ఫిల్మ్!

 

Advertisment
Advertisment
తాజా కథనాలు