BIG BREAKING: హైదరాబాద్‌లో భారీ పేలుడు.. 10 మంది మృతి

హైదరాబాద్‌లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్‌లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

New Update
Hyderabad

హైదరాబాద్‌లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్‌లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఈ పేలుడు ధాటికి 100మీటర్ల దూరంలో కార్మికులు ఎగిరిపడ్డారు. విషయం తెలుసుకుని ఫైర్ ఇంజిన్లు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఇంకా కంపెనీలో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. అయితే ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇది కూడా చూడండి: TG Crime: ప్రైవేట్ హాస్పిటల్ నిర్లక్ష్యంతో పసికందు మృతి...తీవ్ర ఉద్రిక్తత

మరో భవనం కూడా..

ఈ పేలుడు వల్ల రియాక్టర్ భవనం కూలిపోయింది. మరో భవనానికి బీటలు కూడా వచ్చినట్లు సమాచారం. అయితే  ఈ పరిశ్రమలో ఇంకొందరు కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ పేలుడులో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను 11 ఫైరింజన్లతో అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: DK Shiva Kumar: మరో 2 నెలల్లో కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు