లోన్ యాప్లకు బాగా అలవాటు పడి ప్రాణాలు తీసుకున్న కేసులు ప్రస్తుతం పెరిగిపోతున్నాయి. అవసరానికి డబ్బులు లేవని లోన్ తీసుకోవడం ఆ తర్వాత సరైన సమయానికి కట్టరు. దీంతో వారు వేధింపులు పెట్టడం మొదలుపెడతారు. అటు డబ్బులు కట్టలేక, ఇటు వేధింపులు భరించలేక చివరకు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. గుంటూరు జిల్లాకి చెందిన ఓ యువతి కూడా ఇలానే లోన్ యాప్స్ నుంచి డబ్బులు వాడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది కూడా చూడండి: అయ్యప్ప భక్తుల కోసం 34 ప్రత్యేక రైళ్లు..ఏ రూట్లో ఆగుతాయో తెలుసా పది అడుగుల ఎత్తు నుంచి.. వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు జిల్లా తెనాలి మండలం కలుకులూరు గ్రామానికి చెందిన వెన్నెల.. శ్రీశైలం శిఖరేశ్వరం దగ్గర వెన్నెల అనే యువతి లోన్ యాప్ల వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. నిన్న సాయంత్రం శిఖరేశ్వరం గోడ పైనుంచి 10 అడుగుల లోతులో ఉన్న అడవిలోకి దూకింది. శ్రీశైలం: శ్రీశైలం శిఖరేశ్వరం వద్ద యువతి ఆత్మహత్యాయత్నంనిన్న సాయంత్రం శిఖరేశ్వరం గోడ పైనుంచి 10 అడుగుల లోతులో ఉన్న అడవిలోకి దూకిన యువతిరాత్రంతా శిఖరేశ్వరం అడవిలోనే గడిపిన యువతి నిన్నటి రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు గాలింపు చేపట్టిన శ్రీశైలం పోలీసులు శిఖరేశ్వరం అడవిలో… pic.twitter.com/WxhiBv4YXw — RTV (@RTVnewsnetwork) December 9, 2024 ఇది కూడా చూడండి: నేడు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ దీంతో రాత్రంతా ఆ శిఖరేశ్వరం అడవిలోనే గడిపింది. ఇంట్లో కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిన్నటి రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు శిఖరేశ్వరం అడవిలో యువతిని శ్రీశైలం పోలీసులు గుర్తించారు. సురక్షితంగా యువతిని అడవి నుంచి తీసుకొచ్చారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఇది కూడా చూడండి: Asad: రష్యాకు చేరుకున్న సిరియా అధ్యక్షుడు అసద్! ఈ మధ్య కాలంలో ఇలాంటి కేసులు ఎక్కువగా జరుగుతున్నాయి. తెలిసో తెలియక లోన్ యాప్స్లో డబ్బులు తీసుకోవడం, బెట్టింగ్ యాప్స్ వాడటం వంటివి చేసి పెద్ద మొత్తంలో డబ్బులు పొగోట్టుకుంటున్నారు. ఆ తర్వాత వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బెట్టింగ్ యాప్స్ వల్ల ఎందరో యువకులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కూడా చూడండి: Rains: అల్పపీడనం ఎఫెక్ట్.. డిసెంబర్ 15 వరకూ వానలే..వానలు!