/rtv/media/media_files/2025/06/23/teacher-govt-2025-06-23-16-59-51.jpg)
హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో 24 మంది విద్యార్థినులను లైంగికంగా వేధించినందుకు ఓ ఉపాధ్యాయుడిని పోలీసులుఅరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిర్మౌర్ జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గణితం టీచర్ గా పనిచేస్తున్న ఓ టీచర్ తమతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని 8-10వ తరగతికి చెందిన 24 మంది విద్యార్థినులు పాఠశాల ప్రిన్సిపల్ కాంతాదేవికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమె వారి ఫిర్యాదును లైంగిక వేధింపుల నిరోధక కమిటీకి పంపించారు.
Also Read: నిత్య పెళ్లి కూతురు అరెస్ట్.. అలాంటి మగవాళ్లే టార్గెట్..వలలో 12 మంది అమాయకులు!
Himachal Pradesh Horror: School Teacher Allegedly Molests Minor Girls in Sirmaur, Arrested
— Lokmat Times (@lokmattimeseng) June 23, 2025
Read More 👇https://t.co/SpdWXz1hqQ#HimachalPradesh #NationalNews
Also Read: ఇజ్రాయెల్, అమెరికాపై దాడులకు సిద్ధం.. ఇరాన్ సంచలన హెచ్చరిక
ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు
దీనిపై విద్యాశాఖ ఉన్నతాధికారులు దర్యాప్తు చేపట్టారు. విద్యార్థులపై వేధింపులకు పాల్పడినట్లు తేలితే ఆ ఉపాధ్యాయుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఉపాధ్యాయుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. లైంగిక వేధింపుల గురించి తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు శనివారం పాఠశాల వద్దకు చేరుకొని నిరసన చేపట్టారు. ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చాలా మంది తల్లిదండ్రులకు తమ పిల్లలు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి తెలియదన్నారు.
Also Read: ఉప ఎన్నికల్లో ఫలితాల్లో ఆప్ ప్రభంజనం.. షాక్లో బీజేపీ
Also Read: నాకు దక్కనిది.. మరెవ్వరికి దక్కకూడదు.. యూపీలో ప్రేమోన్మాది ఘాతుకం