Gadchiroli: ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు మావోయిస్టులు మృతి

మహారాష్ట్ర, ఛత్తీస్‌‌గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గరలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం వచ్చింది. దీంతో గడ్చిరోలి జిల్లాలో పోలీసులు ఆపరేషన్ నిర్వహించారు.

New Update
Chhattisgarh Encounter: ఛత్తీస్ ఘడ్‌లో ఎన్‌కౌంటర్.. 10 మంది మావోయిస్టులకు మృతి

Maoists

మహారాష్ట్ర, ఛత్తీస్‌‌గఢ్ సరిహద్దుల్లో పోలీసులు ఎన్‌కౌంటర్ నిర్వహించగా నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. గడ్చిరోలి జిల్లాలో పోలీస్ స్పెషల్ కమాండో యూనిట్ సీ-60, సీఆర్‌పీఎఫ్ కలిసి ఆపరేషన్ చేపట్టారు. ఫార్వార్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గరలో మావోయిస్టులు ఉన్నారని సమాచారం రావడంతో ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు రెండు గంటల పాటు కాల్పులు నిర్వహించగా నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి:BIG BREAKING: రేవంత్‌ రెడ్డికి బిగ్‌షాక్‌.. నేషనల్ హెరాల్డ్‌ కేసులో ఈడీ ఛార్జిషీట్‌

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో..

ఇదిలా ఉండగా ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో 28 మంది మావోయిస్టులు మృతి  చెందారు. అబూజ్‌మడ్ ప్రాంతంలో ఉదయం నుంచి పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. అయితే ఈ కాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేత నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారు. నంబాల కేశవరావు 1955లో శ్రీకాకుళం జిల్లా జయ్యన్న పేటలో జన్మించారు.

ఇది కూడా చూడండి:Student Suicide News: అమ్మా నేను చిప్స్ దొంగతనం చేయలేదు.. గుండెలు పిండేసిన 7వ తరగతి విద్యార్థి సూసైడ్ లెటర్!

కేశవరావు మాజీ కబడ్డీ ఆటగాడు. ప్రస్తుతం ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్‌ కాలేజీలో ఇంజనీరింగ్ పూర్తి చేసి మావోయిస్ట్‌లుగా మారారు. అలాగే ఈ ఎన్‌కౌంటర్‌లో మరో కీలక నేత కూడా మృతి చెందాడు. మావోయిస్టు పార్టీ మిలిటరీ విభాగంలో అవామ్-ఇ-జంగ్ ఎడిటోరియల్ చీఫ్ బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జా నాగేశ్వరరావు మరణించాడు.

ఇది కూడా చూడండి:Miss World 2025: టాలెంట్ ఫైనల్ రౌండ్ విజేతగా మిస్ ఇండోనేసియా.. నృత్యాలు, పాటలతో మారుమోగిన మిస్ వరల్డ్ వేదిక

బాపట్ల జిల్లా చీరాల మండలంలోని జాండ్రపేటకు చెందిన ఓ సాధారణ కుటుంబంలో సజ్జా పుట్టాడు. వీరిది చేనేత కుటుంబం. జాండ్రపేటలో స్కూల్ విద్య చదివి గుంటూరులో పాలిటెక్నిక్ చదివారు. అయితే రాడికల్ విద్యార్థి సంఘం పరిచయంతో విప్లవోద్యమానికి జీవితకాలం కార్యకర్తగా వెళ్లి నాగేశ్వరరావు అరెస్టు అయ్యారు. కొన్నాళ్లు జైలులో ఉండి ఆ తర్వాత బయటకు వచ్చి మావోయిస్ట్‌లో చేరారు.

Advertisment
తాజా కథనాలు