Road Accident: వణికించే రోడ్డు ప్రమాదం.. టైరుపేలి ఒకే గ్రామానికి చెందిన 5గురు మృతి

బీహార్‌లోని సరన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కజొన్నతో వెళ్తున్న పికప్ ట్రక్ టైర్ పేలి రోడ్డు మధ్యలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మొక్కజొన్నతో ట్రక్కులో ప్రయాణిస్తున్న 5 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి.

New Update
bihar saran road accident pickup tyre burst 5 dead and 20 injured

bihar saran road accident pickup tyre burst 5 dead and 20 injured

బీహార్‌లోని సరన్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొక్కజొన్నతో వెళ్తున్న పికప్ ట్రక్ టైర్ పేలి రోడ్డు మధ్యలో పడిపోయింది. ఈ ప్రమాదంలో మొక్కజొన్నతో ట్రక్కులో ప్రయాణిస్తున్న 5 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. 

Also Read: దుబాయ్‌లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం

వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కాగా ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారు, గాయపడిన వారంతా ఒకే గ్రామ నివాసితులు అని తెలిసింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదం జిల్లాలోని నయాగావ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాజిత్‌పూర్ ఫోర్ లేన్ సమీపంలో జరిగింది. 

Also Read: ఇది సార్ మా అన్న బ్రాండ్.. సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. వీడియోలు వైరల్!

 ఏం జరిగిందంటే?

ఈ పికప్ ట్రక్ దిగ్వారా నుండి మొక్కజొన్నను లోడ్ చేసుకుని వైశాలి జిల్లాలోని సారాయ్‌కు వెళ్తుంది. ఆ ట్రక్కులో మొక్కజొన్నతో పాటు 25 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో సోన్‌పూర్‌లోని బాజిత్‌పూర్ సమీపంలోకి రాగానే పికప్ ట్రక్కు టైరు అకస్మాత్తుగా పేలిపోయింది. దీంతో వ్యాన్‌ ఒక్కసారిగా బోల్తా పడిపోయింది. ఈ ప్రమాదంలో 5 మంది అక్కడికక్కడే మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో మహిళలు కూడా ఉన్నారు. 

Also Read: భార్యపై ఇంత ప్రేమ.. ఏకంగా మరో ‘తాజ్ మహల్’ను కట్టించిన భర్త - వీడియో చూశారా?

Advertisment
Advertisment
తాజా కథనాలు