/rtv/media/media_files/2025/04/18/JydXuzAwFfWcewjh2Uzm.jpg)
mmts updates
MMTS Incident: కొద్దిరోజుల క్రితం సికింద్రాబాద్ ఎమ్ఎమ్టీఎస్ రైలులో ఓ యువతిపై జరిగిన అత్యాచారయత్నం కేసులో(Hyderabad MMTS Rape Case) కీలక మలుపు చోటు చేసుకుంది. విచారణలో రైల్వే పోలీసులను యువతి తప్పుదోవ పట్టించింది అసలు ఆ యువతిపై అత్యాచారయత్నమే జరగలేదని విచారణలో తేల్చారు పోలీసులు. రైలులో వెళ్తూ ఇన్ స్టా రీల్స్(Insta Reels) చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయిందని పోలీసులు వెల్లడించారు.
Also Read: చిరు ఫ్యాన్స్కి డబుల్ ట్రీట్.. 8kలో 'స్టాలిన్' గ్రాండ్ రీ-రిలీజ్..!
Big Breaking :
— Telangana Awaaz (@telanganaawaaz) April 18, 2025
MMTS ట్రైన్ లో యువతి పై అత్యాచారం జరగలేదని తేల్చిన రైల్వే పోలీసులు
ఇంస్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ ట్రైన్ లో నుండి జారిపడ్డ యువతి
ట్రైన్ లో నుండి జారీ పడి, తనపై అత్యాచారం జరిగినట్టు కట్టుకథ అల్లిన యువతి
లీగల్ ఒపీనియన్ తీసుకుని కేస్ క్లోజ్ చేసిన రైల్వే పోలీసులు..…
Also Read: అప్పు ఇచ్చిన వ్యక్తితో అక్రమ సంబంధం.. మొక్కజొన్న చేను దగ్గర సైలెంట్గా లేపేసింది!
తిడతారని భయపడి
ఈ విషయం చెబితే అంతా తనను తిడతారని భయపడి పోలీసులకు కట్టుకథ చెప్పిన యువతి.. తనపై ఓ యువకుడు అత్యాచారం చేయబోగా కిందకి దూకేసినట్లు నమ్మించింది. విచారణలో పోలీసులకు ఎక్కడా ఎలాంటి ఆధారం దొరక్కపోవడంతో గందరగోళం నెలకొనడంతో యువతిని మరోమారు ప్రశ్నించగా.. తాజాగా ఆమె నిజం ఒప్పుకోవడంతో పోలీసులు విని షాక్ అయ్యారు. దాదాపుగా 300కు పైగా సీసీ కెమెరాలను రైల్వే పోలీసులు పరీశిలించారు. దాదాపు 120 మంది అనుమానితులను ప్రశ్నించారు. చివరకు యువతిపై అత్యాచారం జరగలేదని తేల్చారు. న్యాయ సంబంధమైన అంశాలను పరిశీలించి కేసును మూసివేసే యోచనలో రైల్వే పోలీసులు ఉన్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన యువతి (23) మేడ్చల్లో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. తన సెల్ఫోన్ మరమ్మతు కోసం గత నెల మార్చిలో సికింద్రాబాద్కు వెళ్లి తిగిరి ఎంఎంటీఎస్లో మేడ్చల్కు బయలుదేరగా ఇన్ స్టా రీల్స్ చేస్తూ పొరపాటున కింద పడిపోయింది. దీన్ని కవర్ చేసేందుకు యువతి అత్యాచార నాటకం ఆడింది. గాయపడిన యువతిని ముందుగా గాంధీ ఆసుపత్రికి, ఆ తర్వాత ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుంది.
Also Read: వేసవిలో తరచుగా కడుపునొప్పి వస్తుందా?. ఇది తెలుసుకోండి