Hyderabad: ఐఫోన్, బుల్లెట్ బైక్ అమ్మి మరీ బెట్టింగ్... ఒకేసారి రూ. లక్ష పోవడంతో

బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ యాప్స్‌లో రూ. లక్ష పోగొట్టుకున్న హైదరాబాద్ యువకుడు ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అత్తాపూర్‌లో చోటుచేసుకుంది.  ఐఫోన్, బుల్లెట్ బైక్ అమ్మి మరీ బెట్టింగ్‌కు పాల్పడ్డాడు

New Update
betting-hyd man

betting-hyd man

బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ యాప్స్‌లో రూ. లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ యువకుడు చివరికి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అత్తాపూర్‌లో చోటుచేసుకుంది.  ఐఫోన్, బుల్లెట్ బైక్ అమ్మి మరీ బెట్టింగ్‌కు పాల్పడ్డాడు పవన్ అనే యువకుడు. ఇవి సరిపోవు అన్నట్లుగా కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజు కోసం తల్లిదండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్‌లోనే పెట్తాడు పవన్.  ఏకంగా ఒకేసారి లక్ష రూపాయలు బెట్టింగ్ పెట్టాడు. 

ఒక్క రూపాయి కూడా తిరిగి

పెట్టిన డబ్బులకు ఒక్క రూపాయి కూడా తిరిగి  లాభం రాకపోవడం తో తీవ్ర మనస్థాపం చెందిన పవన్ గురువారం ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మాసబ్ ట్యాంక్ జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్న పవన్  స్వస్థలం గద్వాల్ జిల్లా. ఉన్నత చదవులు కోసం కొడుకుని నగరానికి పంపితే కన్నకొడుకు చివరకు ఇలా విగతజీవిగా మారడంతో పవన్  తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పవన్ ఆత్మహత్యకు ఇదే కారణమా ఇకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

Also read : మరో మహిళతో జ్ఞానేశ్వర్కు అక్రమ సంబంధం.. అనూష హత్య కేసులో బిగ్ ట్విస్ట్!

Advertisment
Advertisment
తాజా కథనాలు