/rtv/media/media_files/2025/04/17/ggQlEZSCgCQys0xxzYjO.jpg)
betting-hyd man
బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలయ్యాడు. బెట్టింగ్ యాప్స్లో రూ. లక్షలు పోగొట్టుకున్న హైదరాబాద్ యువకుడు చివరికి ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన అత్తాపూర్లో చోటుచేసుకుంది. ఐఫోన్, బుల్లెట్ బైక్ అమ్మి మరీ బెట్టింగ్కు పాల్పడ్డాడు పవన్ అనే యువకుడు. ఇవి సరిపోవు అన్నట్లుగా కాలేజీ ఫీజులు, హాస్టల్ ఫీజు కోసం తల్లిదండ్రులు పంపిన డబ్బులను సైతం బెట్టింగ్లోనే పెట్తాడు పవన్. ఏకంగా ఒకేసారి లక్ష రూపాయలు బెట్టింగ్ పెట్టాడు.
బెట్టింగ్ యాప్లకు మరో విద్యార్థి బలి
— Telugu Scribe (@TeluguScribe) April 17, 2025
హైదరాబాద్ - అత్తాపూర్, రెడ్డి బస్తీలో ఫ్యాన్కు ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య
మాసబ్ ట్యాంక్ JNTUలో M Tech చదువుతున్న పవన్.. బెట్టింగ్ యాప్స్ లో బెట్టింగ్కు పాల్పడిన ఒకే సారి 1లక్ష పోగొట్టుకున్న యువకుడు
తనవద్ద ఉన్న ఐఫోన్, రాయల్ ఎన్ ఫీల్డ్… pic.twitter.com/ML2tYRayI8
ఒక్క రూపాయి కూడా తిరిగి
పెట్టిన డబ్బులకు ఒక్క రూపాయి కూడా తిరిగి లాభం రాకపోవడం తో తీవ్ర మనస్థాపం చెందిన పవన్ గురువారం ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం మాసబ్ ట్యాంక్ జేఎన్టీయూలో ఎంటెక్ చదువుతున్న పవన్ స్వస్థలం గద్వాల్ జిల్లా. ఉన్నత చదవులు కోసం కొడుకుని నగరానికి పంపితే కన్నకొడుకు చివరకు ఇలా విగతజీవిగా మారడంతో పవన్ తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పవన్ ఆత్మహత్యకు ఇదే కారణమా ఇకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also read : మరో మహిళతో జ్ఞానేశ్వర్కు అక్రమ సంబంధం.. అనూష హత్య కేసులో బిగ్ ట్విస్ట్!