తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధించబోతోందని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. నల్గొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ 12కు 12 స్థానాల్లో విజయం సాధించి క్లీన్ స్వీప్ చేస్తామని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యకర్తలు గ్రామస్థాయిలోకి వెళ్లి పని చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మోసాల గురించి వివరించాలని వెల్లడించారు. అంతే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకురాబోయే సంక్షేమ పథకాల గురించి సైతం ప్రజలకు, రైతులకు వివరించాలని ఆయన పిలుపునిచ్చారు.
పూర్తిగా చదవండి..Uttam Kumar Reddy: కాంగ్రెస్ పార్టీ 70 స్థానాల్లో విజయం సాధిస్తుంది
రానున్న ఎన్నికల అనంతరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని మాజీ పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 అసెంబ్లీ స్థానాలకు గాను 12 స్థానాల్లో విజయం సాధిస్తామని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు.
Translate this News: