Cong- AAP Seats : అక్టోబర్ 5న హర్యానాలో పోలింగ్ జరగనుంది. నోటిఫికేషన్ ఇప్పటికే విడుదల అయింది. ఇంకో కొద్ది రోజుల్లో దాపి గడువు కూడా ముగిసి పోనుంది. అయితే ఇప్పటివరకు అక్కడ కాంగ్రెస్, ఆ మధ్య సీట్ల పంపకం మాత్రం ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ 10 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు ఆశిస్తుంటే…కాంగ్రెస్ మాత్రం సింగిల్ డిజిట్లోనే ఇస్తామని చెబుతోంది. డబుల్ డిజిట్ సీట్లు ఇవ్వలేమని కాంగ్రెస చెబుతున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ సీట్ల పంపకం మీద చర్చలు ఎంతకీ తెగడం లేదు. రెండు పార్టీలు రాజీకు రావం లేదు. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ.వేణుగోపాల్తో పలుమార్లు చర్చలు జరిపారు. అయినా పరిష్కారం కాలేదు. ఆప్కి 5-6 సీట్లు, సమాజ్వాదీ పార్టీకి ఒకటి, లెఫ్ట్ పార్టీలకు ఒకటి ఇస్తామని కాంగ్రెస్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఆప్ నేతలు మాత్రం 10 సీట్లు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోంది.
పూర్తిగా చదవండి..Haryana: హర్యానాలో కుదరని పొత్తు..సీట్ల పంపకాల మీద తెగని పంచాయితీ
హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య పొత్తు కుదిరేటట్లు కనిపించడం లేదు. రెండు రోజులుగా సీట్ల పంపకాల మీద చర్చలు జరుగుతూనే ఉన్నాయి..కానీ ఇప్పటి వరకు ఒక కొలిక్కి రాలేదని తెలుస్తోంది. దీంతో సీట్ల పంచాయితీ మళ్ళీ మొదటికొచ్చిందని తెలుస్తోంది.
Translate this News: