CM Revanth : మూతబడ్డ నిజాం చక్కెర కర్మాగారాలు తెరిచే దిశగా కాంగ్రెస్ నిర్ణయం

తెలంగాణలో మూతబడ్డ నిజాం చక్కెర కార్మాగాల పునరుద్ధరణకు వీలైనంత త్వరగా సమగ్ర నివేదిక అందించాలని సీఎం రేవంత్ కేబినేట్‌ సబ్‌కమిటీకి సూచించారు. బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు.

New Update
TS Cabinet : ఈనెల 12న మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్న కేబినెట్.!

Nizam Sugar Factory : రాష్ట్రంలో మూతపడ్డ నిజాం చక్కెర కర్మాగారాల(Nizam Sugar Factory) పునరుద్ధరణకు వీలైనంత తొందరగా సమగ్ర నివేదికను అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేబినేట్ సబ్ కమిటీకి సూచనలు చేశారు. ఆదివారం సచివాలయంలో ఈ కమిటీ సమావేశం జరిగింది. చక్కెర కర్మాగారాల పునరుద్ధరణ కమిటీ ఛైర్మన్ గా ఉన్న పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు(Sridhar Babu) తో పాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్​ రెడ్డి, ఎమ్మెల్యేలు సుదర్శన్​ రెడ్డి, రోహిత్​ రావు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read : ఇకపై వాహనాలకు TS కాదు TGనే.. రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం

బోధన్, ముత్యంపేటలో మూతపడ్డ నిజాం షుగర్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పాత బకాయిలు. ఆర్థిక ఇబ్బందులను చర్చించారు. ఆయా ప్రాంతాల్లోని చెరుకు రైతుల అవసరాలు, ఇప్పుడున్న సాధక బాధకాలను సమగ్రంగా చర్చించారు.

మూతపడ్డ వాటిని తెరిపించేందుకు ఏం చేయాలి, ఏయే మార్గాలను అనుసరించాలో అన్వేషించి తగు సలహాలు సూచనలను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కమిటీకి సూచించారు. నిర్ణీత గడువు పెట్టుకొని కమిటీ నివేదిక తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా మరోసారి సమావేశమవుదామని సీఎం అన్నారు.

Also Read : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే జరిగేది ఇదే.. డి.రాజా సంచలన వ్యాఖ్యలు

Advertisment
Advertisment
తాజా కథనాలు