Telangana: తెలంగాణ ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాలు.. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ ఆహ్వాన లేఖ

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా జూన్‌ 2న హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో జరగనున్న అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వాన లేఖ రాశారు.

New Update
Telangana: తెలంగాణ ఆవిర్భవ దశాబ్ది ఉత్సవాలు.. కేసీఆర్‌కు సీఎం రేవంత్‌ ఆహ్వాన లేఖ

CM Revanth Reddy Invitation To KCR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవం (Telangana Formation Day) సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం జూన్ 2న దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో (Parade Ground) జరగనున్న అధికారిక కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ.. మాజీ సీఎం కేసీఆర్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక లేఖ రాశారు. ఈ ఆహ్వాన లేఖను.. స్వయంగా కేసీఆర్‌కు అందించాలని.. ప్రోటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్‌కు సూచించారు.

కేసీఆర్‌ను స్వయంగా కలిసి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వాన పత్రిక అందించేందుకు కేసీఆర్ సిబ్బందితో వీళ్లిద్దరు చర్చలు జరుపుతున్నారు. గజ్వెల్ ఫామ్ హౌస్‌లో కేసీఆర్ ఉన్నారని తెలియడంతో.. అక్కడకు వెళ్లి స్వయంగా ఆహ్వాన పత్రికను అందించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరీ కేసీఆర్‌ ఈ కార్యక్రమానికి వస్తారా రాదా అనే దానిపై ఆసక్తి నెలకొంది.

Also Read: గ్రూప్-1 అభ్యర్థులకు అలెర్ట్‌.. ఈ రూల్స్ పాటించాల్సిందే

Advertisment
తాజా కథనాలు