Telangana : అమిత్ షా ఫేక్ వీడియో.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

అమిత్‌ షా ఫేక్‌ వీడియో ఘటనపై ఢిల్లీ పోలీసులు.. సీఎం రేవంత్‌ను, ఇతర కాంగ్రెస్ నేతలను ఈరోజు విచారణకు రావాలని రెండ్రోజుల క్రితం నోటీసులు పంపారు. అయితే సీఎం రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నేతలు విచారణకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం 15 రోజుల టైం కావాలని అడిగారు.

New Update
TG Jobs : నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. దరఖాస్తుకు నో ఫీజ్!

Amit Shah Fake Video : ఇటీవల అమిత్ షా(Amit Shah) తెలంగాణ(Telangana) కు వచ్చినప్పడు రిజర్వేన్లకు సంబంధించి మాట్లాడిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియా(Social Media) లో వైరలవుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై ఢిల్లీ పోలీసులు కేసు(Delhi Police Case) కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్‌(CM Revanth Reddy) తో పాటు మరికొందరు కాంగ్రెస్ నేతలకు బుధవారం విచారణకు రావాలని ఢిల్లీ పోలీసులు రెండు రోజుల క్రితం నోటీసులు పంపారు. అయితే సీఎం రేవంత్ మాత్రం ఈరోజు విచారణ హాజరుకావొద్దని నిర్ణయం తీసుకున్నారు. న్యాయపరంగా ఈ విషయాన్ని తేల్చుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also read: నాలుగు స్కూల్స్‌కు బాంబు బెదిరింపులు..అప్రమత్తమైన పోలీసులు

రేవంత్‌తో పాటు మిగతా కాంగ్రెస్ నేతలు కూడా ఢిల్లీకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నారు. తమకు ఇందుకోసం 15 రోజుల పాటు సమయం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు లేఖ రాశారు. ఇదిలాఉండగా.. కేంద్రమంత్రి అమిత్ షాకి సంబంధించిన ఆ ఫేక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆయన రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న ముస్లీం రిజర్వేషన్లను రద్దు చేసి.. వాటి హక్కులు ఎస్సీ, ఎస్టీ ఓబీసీలకు ఇస్తామని అన్నారు. కానీ ఆ ఫేక్‌ వీడియోలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను రద్దు చేస్తామని మాట్లాడినట్లు ఉంది. అయితే ఈ వీడియోపై అమిత్ షా కూడా స్పందించారు. తాము రిజర్వేషన్లను ఎప్పటికీ తొలగించమని స్పష్టం చేశారు.

Also Read: తగ్గిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు!

Advertisment
తాజా కథనాలు