కొందరికి థ్రిల్లింగ్గా ఉండే సిరీస్లు, సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది. అలాంటి వారి కోసమే సరికొత్త థ్రిల్లింగ్ సిరీస్ త్వరలో రాబోతుంది. అభిజ్ఞా, చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్' (Viraatapalem: pc Meena Reporting) వెబ్సిరీస్ త్వరలో రాబోతుంది. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూన్ 27 నుంచి జీ5 (ZEE 5) వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!
It is a curse. But, for how long will #Viraatapalem believe this?
— Indian Clicks (@IndianClicks) June 19, 2025
Join PC Meena on the hunt to chase this wedding mystery.#Viraatapalem PC Meena Reporting Telugu Trailer ▶️https://t.co/rwhTyo4Ygm#ViraatapalemOnZee5 PREMIERES 27th JUNE.
From the director and makers of the… pic.twitter.com/eKXDUxjoCU
ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు
అమ్మాయిలు అంతా పారిపోతుంటారు..
ఈ నేపథ్యంలో దీని ట్రైలర్ను తాజాగా విడుదల చేశారు. 1980ల సమయంలో ఓ గ్రామంలో ఉండే అమ్మాయిలు అక్కడ నుంచి పారిపోతుంటారు. ఎవరికైనా పెళ్లి జరిగిన రోజే చనిపోతుంటారు. దీంతో ఆ గ్రామంలో ఉన్న అమ్మాయిలు బయటకు వెళ్లిపోతుంటారు. అసలు అక్కడికి ఏ అమ్మాయి కూడా రాదు.
ఇది కూడా చూడండి: Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!
అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఎందుకు చనిపోతారు? ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి? ఆ ఊర్లో ప్రతి వధువు పెళ్లి రోజున ఎందుకు మరణిస్తుంది? దశాబ్ద కాలం నుంచి ఆ గ్రామంలో పెళ్లిళ్లు ఎందుకు జరగడం లేదు? అనే విషయాలతో సిరీస్ను చాలా థ్రిల్లింగ్ రూపొందించినట్లు ట్రైలర్లో తెలుస్తోంది. మరి మీరు ఒకసారి ట్రైలర్ చూడకపోతే ఒకసారి చూసేయండి.
ఇది కూడా చూడండి: అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో ధ్వంసమైన బ్లాక్ బాక్స్ విదేశాలకు..?