Viraatapalem Trailer: గ్రామానికి పట్టుకున్న శాపం.. థ్రిల్లింగ్‌‌గా విరాటపాలెం ట్రైలర్‌

సరికొత్త థ్రిల్లింగ్ వెబ్‌సిరీస్ 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌' ట్రైలర్‌ రిలీజైంది. అభిజ్ఞా, చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ట్రైలర్ అదిరిపోయింది. కృష్ణ పోలూరు దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్‌ జూన్‌ 27 నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది.

New Update

కొందరికి థ్రిల్లింగ్‌గా ఉండే సిరీస్‌లు, సినిమాలు అంటే ఇష్టం ఉంటుంది. అలాంటి వారి కోసమే సరికొత్త థ్రిల్లింగ్ సిరీస్ త్వరలో రాబోతుంది. అభిజ్ఞా, చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన 'విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌' (Viraatapalem: pc Meena Reporting) వెబ్‌సిరీస్‌ త్వరలో రాబోతుంది. కృష్ణ పోలూరు దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ జూన్‌ 27 నుంచి జీ5 (ZEE 5) వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చూడండి: IND vs ENG : వాళ్లు లేకుండా ఆడటం కష్టమే.. రాహుల్ ఎమోషనల్ కామెంట్స్!

ఇది కూడా చూడండి: Jagan: 'నేనొస్తే ఆంక్షలెందుకు'.. చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు

అమ్మాయిలు అంతా పారిపోతుంటారు..

ఈ నేపథ్యంలో దీని ట్రైలర్‌ను  తాజాగా విడుదల చేశారు. 1980ల సమయంలో ఓ గ్రామంలో ఉండే అమ్మాయిలు అక్కడ నుంచి పారిపోతుంటారు. ఎవరికైనా పెళ్లి జరిగిన రోజే చనిపోతుంటారు. దీంతో ఆ గ్రామంలో ఉన్న అమ్మాయిలు బయటకు వెళ్లిపోతుంటారు. అసలు అక్కడికి ఏ అమ్మాయి కూడా రాదు.

ఇది కూడా చూడండి: Coriander Seed Water: కొత్తిమీర గింజల నీరు ఒక దివ్యౌషధం. దీని ప్రయోజనాలను తెలుసుకోండి!

అయితే పెళ్లి చేసుకున్న అమ్మాయిలు ఎందుకు చనిపోతారు? ఆ ఊరికి ఉన్న శాపం ఏంటి? ఆ ఊర్లో ప్రతి వధువు పెళ్లి రోజున ఎందుకు మరణిస్తుంది? దశాబ్ద కాలం నుంచి ఆ గ్రామంలో పెళ్లిళ్లు ఎందుకు జరగడం లేదు? అనే విషయాలతో సిరీస్‌ను చాలా థ్రిల్లింగ్ రూపొందించినట్లు ట్రైలర్‌లో తెలుస్తోంది. మరి మీరు ఒకసారి ట్రైలర్ చూడకపోతే ఒకసారి చూసేయండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు