Jaat 2: టాలీవుడ్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'జాట్' బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. ఏప్రిల్ 10న విడుదలైన ఈ చిత్రం మొదట కాస్త నెమ్మదిగా మొదలైనా.. వీకెండ్ వచ్చేసరికి జోష్ పెంచింది. తొలి వారాంతంలో ప్రపంచవ్యాప్తంగా రూ. 70.4 కోట్ల వసూళ్లు చేసింది. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ మరో అదిరిపోయే న్యూస్ అనౌన్స్ చేశారు.
#JAAT is not resting after the blockbuster at the box office 💥
— Mythri Movie Makers (@MythriOfficial) April 17, 2025
He is on to a new mission. This time, the MASS FEAST will be bigger, bolder, and wilder 💪#JAAT2 ❤🔥
Starring Action Superstar @iamsunnydeol
Directed by @megopichand
Produced by @MythriOfficial &… pic.twitter.com/Cp5RMrgXuR
జాట్ 2 కూడా..
'జాట్' సీక్వెల్ జాట్ 2 కూడా ఉండబోతున్నట్లు ప్రకటించారు. 'జాట్ ఆన్ టు ఎ న్యూ మిషన్!' #జాట్2 అంటూ ఎక్స్ వేదికగా పోస్టర్ రిలీజ్ చేశారు. సీక్వెల్ అనౌన్స్ చేసినప్పటికీ .. దీనికి సంబంధించిన తారాగణం గురించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ చిత్రాన్ని కూడా మైత్రి మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ వై, టిజి విశ్వ ప్రసాద్ నిర్మించనున్నారు. విడుదలైన వారంలోనే సీక్వెల్ అనౌన్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. చందూ మొండేటి హిందీలో తెరకెక్కించిన తొలి చిత్రం 'జాట్'. ఈ చిత్రంలో సన్నీ డియోల్ హీరోగా నటించగా.. రణదీప్ హుడా విలన్గా నటించారు. రెజీనా కాసాండ్రా, సయామి ఖేర్, వినీత్ కుమార్ సింగ్, ప్రశాంత్ బజాజ్, జరీనా వహాబ్, జగపతి బాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ఇదిలా ఉంటే ఓ వైపు విమర్శలు ఎదుర్కుంటూనే మరోవైపు సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ కొనసాగిస్తోంది ఈ చిత్రం. అయితే ఈ మూవీలో చర్చి సన్నివేశం చిత్రీకరణపై పై క్రైస్తవ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. ఇది క్రైస్తవ మతస్థుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని.. చిత్రాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
telugu-news | cinema | cinema-news | latest-news | JAAT movie
Also Read: ఒక్క మాటతో ప్రభాస్ 'స్పిరిట్'ని ఆకాశానికి ఎత్తేసిన రాజమౌళి..