BIG BREAKING: పాక్-ఇండియా వార్ ఎఫెక్ట్.. హైదరాబాద్ లో టపాసులు కాల్చడంపై బ్యాన్!

హైదరాబాద్ పోలీసులు నగర ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టపాసుల అమ్మకాలు, కాల్చడం నిషేధమని ఆదేశించారు. ఇండియా టార్గెట్ గా పాక్ డ్రోన్స్, మిస్సైల్స్ తో దాడులు చేస్తుంది. ఇలాంటి సమయంలో టపాసులు పేల్చడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉందని తెలిపారు.

New Update
Pak-India War Effect  Ban on bursting of crackers

Pak-India War Effect Ban on bursting of crackers

India- Pak War Effect: భారత్- పాక్ మధ్య నెలకొన్న  ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం అన్ని రాష్ట్రాలకు హై అలెర్ట్ ప్రకటించింది. పబ్లిక్ ప్లేసెస్, చారిత్రాత్మక కట్టడాలు, పార్క్స్ వంటి సున్నితమైన ప్రదేశాల్లో  ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. 

Also Read: JVAS Re Release: మానవా.. కొత్తగా 'జగదేకవీరుడు అతిలోక సుందరి' రీ రిలీజ్ ట్రైలర్.! భలే ఉంది

టపాసుల పేల్చడం నిషేధం 

ఈ క్రమంలో హైదరాబాద్ నగర ప్రజలకు సిటీ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. శాంతిభద్రతలు దృష్ట్యా నగరంలో టపాసుల అమ్మకాలు, కాల్చడాన్ని నిషేదిస్తున్నట్లు ఆదేశించారు. అయితే ఇప్పటికే ఇండియా టార్గెట్ గా పాకిస్థాన్ డ్రోన్లు, మిస్సైల్స్ తో దాడులు చేస్తోంది. ఇలాంటి సమయంలో టపాసులు పేల్చడం వల్ల ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉంది. ఏది బాంబు.? ఏది టపాసు అని తెలుసుకోవడంలో ప్రజలు, అధికారుల్లో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. అందువల్ల పబ్లిక్ ప్లేసెస్, వివాహ వేడుకలు, ఇతర పబ్లిక్ ఈవెంట్స్ లో టపాసులు పేల్చవద్దని సూచించారు పోలీసులు. 

Also Read: Miss World 2025: భారత్- పాకిస్థాన్ వార్ ఎఫెక్ట్.. మిస్‌ వరల్డ్‌2025 పోటీలు రద్దు?

ఈ నేపథ్యంలో హైదరాబాద్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న నగరాల్లో టపాసుల అమ్మకాలు, కాల్చటంపై నిషేధం విధించింది ప్రభుత్వం. నియమాలను అతిక్రమించి ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. 

latest-news | telugu-news | 2025 india pakistan war | ban on firecrackers

Also Read: Mothers Day Special: ఈ పాటలు వింటే అమ్మ గుర్తొస్తుంది.. తెలుగులో బెస్ట్ అమ్మ పాటలు!

Advertisment
Advertisment
తాజా కథనాలు