/rtv/media/media_files/2024/12/27/fM7pgykUTgdXUImOhJiR.jpg)
NAMPALLY COURT - ALLU ARJUN
ఏం జరిగిందంటే?
కాగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆపై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అల్లు అర్జున్కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్ను చంచల్గూడ జైలుకు తరలించారు. వెంటనే బెయిల్ విషయంలో హైకోర్టును ఆశ్రయించగా.. 4వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు!
దీంతో బన్నీ చంచల్గూడ జైలు నుంచి ఆ రాత్రే బయటకొచ్చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ మధ్యంతర బెయిల్ మంజూరు కాపీ తమకు ఇంకా అందలేదని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఆ రాత్రంతా బన్నీని జైలులోనే ఉంచారు. మరుసటి రోజు విడుదల చేశారు.
ALSO READ: పాకిస్తాన్లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి...
మరోవైపు సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు అందించారు. అలాగే రేవతి కుమారుడు శ్రీతేజ్ సైతం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు.
ALSO READ: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం